సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం కనబడుతోంది. ఆడపడచులు రంగవళ్లులు, గోబ్బమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందాలు, సరదా సవాళ్లు, కొత్త అల్లుళ్లు, బావమరదళ్లు, ఏ ఇల్లు చూసినా.. పిల్లాపాపలతో కుటుంబసమేతంగా సంతోషంగా గడుపుతారు. ఇలా పండగ మూడు రోజులే అయినా వారం రోజుల వరకు పండగశోభ ప్రతీ పల్లెలో ప్రత్యక్షం అవుతుంది. అలాంటి పండగ రోజున రవితేజను సినీ ఫైనాన్షియర్ అడ్డుకోవడమేమిటీ అంటారా.? సంక్రాంతి అంటే కొత్త సినిమాలు క్యూ కడుతాయన్న విషయం కూడా తెలిసిందే కదా.?
కోవిడ్ కారణంగా లాక్ డౌన్, ఆ తరువాత అన్ లాక్ నేపథ్యంలో సినిమా ధియేటర్లకు పెద్దగా ప్రేక్షకులు రావడం లేదు. దీంతో సంక్రాంతి సీజన్ లో కొత్త సినిమాలతో మళ్లి సినిమా థియేటర్లకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనికి సాయితేజ్ నటించిన సోలో బతుకే సో బెటరు అన్న చిత్రం అంకురార్పణ కూడా చేసింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగానే అదరించారు. మంచి కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టింది. ఇక ఆ ఒరవడిని మరింత బలోపేతం చేయడానికి రెడీ అయిన మాస్ మహారాజా చిత్రానికి అనూహ్యంగా చెన్నైకి చెందిన ఓ సినీ ఫైనాన్సియర్ బ్రేకులు వేయించారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కథానాయకుడుగా రూపొందుతున్న 'క్రాక్' చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదల చేసేందుకు అంతా సిద్దమైన తరుణంలో చిత్ర నిర్మాత మధు తో వున్న ఆర్థికపరమైన వ్యవహరాలపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను క్రాక్ చిత్ర నిర్మాత మధుకు అయోగ్య చిత్ర నిర్మాణానికి గాను పది కోట్ల రూపాయలు ఇచ్చానని, అయితే ఆ చిత్రాన్ని నిర్మించే బదులు ఆ డబ్బుతో ఆయన క్రాక్ చిత్రాన్ని నిర్మించి విడుదల చేస్తున్నట్టు.. దీంతో చిత్ర విడుదలను నిలుపుదల చేయాలని కోరారు. దీంతో న్యాయస్థానం ఆయనకు సానుకూలంగా తీర్పునిచ్చింది. ఫైనాన్షియర్ కు రూ.10 కోట్లు ఇచ్చిన తరువాత చిత్రాన్ని విడుదల చేయాలని అదేశాలు జారీ చేసింది. దీంతో క్రాక్ చిత్రం విడుదలకు బ్రేకులు పడ్డాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more