బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు ప్రస్తుతం బాలీవుడ్ సహా యావత్ సినీరంగంలో ప్రకంపనలు రాజేస్తోంది. డ్రగ్స్ అలవాటు చేసిన తన కుమారుడ్ని నటి రియా ఛక్రవర్తి హత్య చేసిందని సుశాంత్ సింగ్ తండ్రి ఆరోపించిన నేపథ్యంలో ఎన్సీబీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రియా చక్రవర్తికి డ్రగ్స్ పెడ్లర్ తో సంబంధాలు వున్నాయన్న సమాచారం నేపథ్యంలో ఎన్సీబి వాటిపై నిషితంగా దర్యప్తు చేసి పలు అధారాలను కూడా సేకరించింది. ఈ క్రమంలో అమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో బాలీవుడ్ లో డ్రగ్స్ సంబంధాలు కలకలం రేపుతున్నాయి.
అయితే తాజాగా రియా చక్రవర్తి ఎన్సీబీ విచారణలో బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లను కూడా ఎన్సీబి అధికారులకు ఎదుట వెలువరించింది. అయితే డ్రగ్స్ తో సంబంధం వున్న పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్ల పేరును కూడా వెలువరించిందని సమాచారం, వారిలో అటు బాలీవుడ్ సహా ఇటు టాలీవుడ్ లోనూ రాణిస్తున్న నటి పేరు కూడా వున్నట్లు వార్తలు వినిపించాయి, అయితే వారెవరా అన్న ఊహాగానాలతో ఇప్పటికే పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. కాగా మీడియా సంస్థలు వెలువరించిన కథనాలు బాలీవుడ్ షక్ అవుతుంది. ఇక మరో నటి ఓ రాష్ట్రానికి నో టు డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వుంటూనే అభియోగాలు ఎదుర్కోంటోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, తెలుగులో పలు చిత్రాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్, నటుడు రణ్వీర్ సింగ్ సన్నిహితురాలు, డిజైనర్ సిమోన్ ఖంబట్ట పేర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర నో టు డ్రగ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వున్న రకుల్ పేరులో ఈ జాబితాలో వెల్లడి కావడంతో అమెపై విచారణకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, వీరితోపాటు బాలీవుడ్ లోని పలువురిపై ఇప్పుడు ఎన్సీబీ నిఘాపెట్టినట్టు ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. విచారణలో భాగంగా రియా చక్రవర్తి ప్రత్యేకంగా పై పేర్లను వెల్లడించినట్టు టైమ్స్ నౌ తన కథనంలో పేర్కొంది. కాగా, తాను మాదకద్రవ్యాలు తీసుకోనని తొలుత చెప్పిన రియా.. ఆ తర్వాత తాను కూడా డ్రగ్స్ తీసుకుంటానని విచారణలో అంగీకరించినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more