Gopichand donates Rs 10 lakh to CCC చిరంజీవి సిసిసికి యాక్షన్ హీరో గోపిచంద్ విరాళం

Covid19 thalapathy vijay gopichand donates huge amount to fight against corona

coronavirus, covid-19, lockdown, Vijay, Thalapathy Vijay, Covid-19, Coronavirus, Thalapathy Vijay coronavirus, Thalapathy Vijay, Gopichand, Chiranjeevi, chiranjeevi ccc, gopichand donation, shivani, shivatmika, Covid-19, covid-19 lockdown, corona lockdown, tollywood, movies, entertainment

Kollywood Hero Thalapathy Vijay donated Rs 1.30 crore to PM-CARES and Chief Minister's Relief Funds of different states. Tollywood Macho Star Gopichand has donated a sum of Rs 10 lakh to the Chiranjeevi-led Corona Crisis Charity, which is Tollywood's richest coronavirus-time fund to help out cine workers.

కరోనాపై యు్ద్దానికి సన్నధమైన సినీ ప్రముఖులు.. భారీ విరాళాలు

Posted: 04/22/2020 09:31 PM IST
Covid19 thalapathy vijay gopichand donates huge amount to fight against corona

కరోనావైరస్‌పై పోరుకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కదిలారు. అయితే ఈ పోరులో తాము సైతం ఉన్నామంటూ టాలీవుడ్ హీరో గోపిచంద్ తో పాటు హీరో రాజశేఖర్ కూడా కదిలారు. వీరితో పాటు తమిళ కథానాయకుడు విజయ్‌ కూడా చేయి కలిపాడు. అయితే గోపిచంద్, రాజశేఖర్ తనయలు తెలులు రాష్ట్రంలోనే పోరుకు రెడీ అయితే హీరో దళపతి విజయ్ మాత్రం మొత్తంగా దక్షణిభారతావనికే అండగా నిలుస్తూ భారీ విరాళం ప్రకటించారు. తన సొంత రాష్ట్రం తమిళనాడుతోపాటు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు కూడా ఆర్థిక సాయం చేశారు. మొత్తం రూ.1.3 కోట్లు ఆయన విరాళంగా ప్రకటించారు.

ఇందులో ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు, కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా సినీ కళాకారుల కోసం పనిచేస్తున్న ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌంత్‌ ఇండియా సంఘానికి రూ.25 లక్షలు సాయం చేశారు. అంతే కాకుండా విజయ్‌ తన అభిమాన సంఘాల ద్వారా లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వారికి నేరుగా సాయం చేస్తున్నారు.

యుద్దానికి సై అంటున్న గోపీచంద్‌

లాక్ డౌన్‌ వల్ల ఇబ్బందులను ఎదుర్కోంటూ వాటిని తమ వారితో కూడా చెప్పుకునే వెసలుబాటు లేని అనాధ బాలబాలికు అండగా నిలుస్తున్న టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్.. తాజాగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల్ని ఆదుకోవడం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ ఛారిటీకి టాలీవుడ్‌ హీరో గోపీచంద్‌ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. అదేవిధంగా 1500 మందితో కూడిన అనాథ శరణాలయానికి ఆహారం అందిస్తున్నారు. రెండు నెలలపాటు ఆయన వీరి ఆకలి తీర్చనున్నారు. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 2000మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

టాలీవుడ్‌ హీరో రాజశేఖర్‌ కుమార్తెలు శివానీ, శివాత్మిక కరోనాపై సమరానికి తమవంతు ఆర్థిక సాయం చేశారు. ఇద్దరు కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 లక్షలు అందించారు. బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కు అందించారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీకి రూ.2 లక్షలు అందించారు. ఏషియన్‌ గ్రూప్‌ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి రూ.21 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కు అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  Thalapathy Vijay  Rajashekar  Shivani  Shivatmika  Covid-19  Coronavirus  donatioms  tollywood  

Other Articles