కరోనావైరస్పై పోరుకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కదిలారు. అయితే ఈ పోరులో తాము సైతం ఉన్నామంటూ టాలీవుడ్ హీరో గోపిచంద్ తో పాటు హీరో రాజశేఖర్ కూడా కదిలారు. వీరితో పాటు తమిళ కథానాయకుడు విజయ్ కూడా చేయి కలిపాడు. అయితే గోపిచంద్, రాజశేఖర్ తనయలు తెలులు రాష్ట్రంలోనే పోరుకు రెడీ అయితే హీరో దళపతి విజయ్ మాత్రం మొత్తంగా దక్షణిభారతావనికే అండగా నిలుస్తూ భారీ విరాళం ప్రకటించారు. తన సొంత రాష్ట్రం తమిళనాడుతోపాటు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు కూడా ఆర్థిక సాయం చేశారు. మొత్తం రూ.1.3 కోట్లు ఆయన విరాళంగా ప్రకటించారు.
ఇందులో ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు, కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా సినీ కళాకారుల కోసం పనిచేస్తున్న ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌంత్ ఇండియా సంఘానికి రూ.25 లక్షలు సాయం చేశారు. అంతే కాకుండా విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వారికి నేరుగా సాయం చేస్తున్నారు.
యుద్దానికి సై అంటున్న గోపీచంద్
లాక్ డౌన్ వల్ల ఇబ్బందులను ఎదుర్కోంటూ వాటిని తమ వారితో కూడా చెప్పుకునే వెసలుబాటు లేని అనాధ బాలబాలికు అండగా నిలుస్తున్న టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్.. తాజాగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల్ని ఆదుకోవడం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి టాలీవుడ్ హీరో గోపీచంద్ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. అదేవిధంగా 1500 మందితో కూడిన అనాథ శరణాలయానికి ఆహారం అందిస్తున్నారు. రెండు నెలలపాటు ఆయన వీరి ఆకలి తీర్చనున్నారు. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 2000మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక కరోనాపై సమరానికి తమవంతు ఆర్థిక సాయం చేశారు. ఇద్దరు కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 లక్షలు అందించారు. బుధవారం మంత్రి కేటీఆర్ను కలిసి చెక్కు అందించారు. కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.2 లక్షలు అందించారు. ఏషియన్ గ్రూప్ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి రూ.21 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు బుధవారం మంత్రి కేటీఆర్ను కలిసి చెక్కు అందించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more