టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ‘రామాయణం’ ప్రాజెక్ట్ను రెండు నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రామాయణ మహాకావ్యంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తీసుకొని తెరపై ఆవిష్కరించారు. అయితే, తొలిసారి మొత్తం రామాయణాన్ని మూడు భాగాలుగా అది కూడా 3డి టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత అల్లు అరవింద్ సిద్ధమయ్యారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ రామాయణాన్ని తెరకెక్కించనున్నారు. ఈ భారీ చిత్రం నిర్మాణం కోసం మధు మంతెన, నమిత్ మల్హోత్ర (ప్రైమ్ ఫోకస్)తో అల్లు అరవింద్ జతకట్టారు. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ ఈ సిరీస్కు దర్శకత్వం వహించనున్నారు. తొలి భాగం 2021లో విడుదలవుతుంది. అయితే, తొలిభాగాన్ని నితీష్ తివారి తెరకెక్కించనున్నారు.
‘దంగల్’ తరవాత తాజాగా ‘చిచ్చోరి’ లాంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న తివారి ప్రస్తుతం ‘రామాయణం’ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్ రాముడిగా, దీపికా పదుకొణె సీతగా నటించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఈ భారీ చిత్రంలో ప్రభాస్ కూడా నటించనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
రావణుడి పాత్రలో ప్రభాస్ను నటింపజేయాలని మేకర్స్ చూస్తున్నారట. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రూ.600 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ఇది హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా తెరకెక్కనుంది కాబట్టి పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఈ ప్రాజెక్ట్లోకి వస్తే సినిమాకు బలం చేకూరుతుందని మేకర్స్ భావించారని సమాచారం.
రామాయణంలో ఎంతో కీలకమైన రావణుడి పాత్రకు ప్రభాస్ అయితే కరెక్ట్గా సరిపోతారని దర్శక నిర్మాతలు నిర్ణయించారట. అయితే, ఇది ఇంకా చర్చల దశలో ఉందని అంటున్నారు. ఈ విషయంలో ప్రభాస్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదట. ఒకవేళ ప్రభాస్ గనుక ఈ పాత్ర చేయడానికి ముందుకొస్తే భారత సినీ చరిత్రలో ఇది మరో సంచలనాత్మక చిత్రం కావడం ఖాయం.
ఇదిలా ఉంటే, చిత్ర తారాగణం విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దర్శకుడు నితీష్ తివారి అంటున్నారు. ఇటీవల ‘పింక్విల్లా’ వెబ్సైట్తో మాట్లాడిన ఆయన తాము ఇంకా కాన్సెస్ట్ లెవెల్లోనే ఉన్నామని చెప్పారు. తారాగణం గురించి ప్రస్తుతానికి ఆలోచించడం లేదని అన్నారు. దర్శకుడు ఇలా చెబుతున్నప్పటికీ లోపల అయితే చర్చలు జరుగుతున్నాయన్నది టాక్.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్లో 40 శాతమే వచ్చిందిని ఎమ్టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more