రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీ రావు మనవరాలు, దివంగత సుమన్, విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహన, వినయ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఇవాళ జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఉదయం 11.58 గంటలకు ఒక్కటైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ జంటను అశీర్వదించడానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లు హాజరయ్యారు.
వీరితో పాటుగా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సీవీసీ కేవీ చౌదరి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ దంపతులు, ప్రోఫెసర్ కోదండరామ్, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెంతదితర ప్రముఖులు విచ్చేశారు.
హాజరైన రాజకీయ ప్రముఖులు:
ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాదరావు, తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, విజయ సాయిరెడ్డి, హరీశ్ రావు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, మంత్రి నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, కేశినేని నాని, ఎల్ రమణ, మహమూద్ అలీ, సుబ్బరామిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, మండలి బుద్ధ ప్రసాద్, జయ ప్రకాశ్ నారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్రెడ్డి, జి.వివేక్, కొండ్రు మురళి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పరిటాల సునీత, కొనకళ్ల నారాయణ తదితరులు తరలివచ్చారు.
హాజరైన సినీరంగ ప్రముఖులు:
మెగాస్టార్ చిరంజీవి దంపతులు, సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల, రెబల్ స్టార్ కృష్ణం రాజు దంపతులు, విక్టరీ వెంకటేశ్, ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు, మెగా ప్రోడ్యూసర్ అల్లు అరవింద్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నరేశ్, దగ్గుబాటి సురేశ్, శ్యాంప్రసాద్ రెడ్డి, అక్కినేని అమల, మెగా ప్రిన్సెస్స్ నిహారిక, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, ఎస్వీ కృష్ణారెడ్డి, బ్రహ్మానందం, బోయపాటి శ్రీనివాస్, ఎం.ఎం. కీరవాణి, అచ్చిరెడ్డి, చలపతిరావు, ఆర్.నారాయణమూర్తి, శోభు యార్లగడ్డ, బీవీఎస్ఎన్ ప్రసాద్, సునీల్, శ్రీను వైట్ల, సుశాంత్, కోటి, కోట శ్రీనివాసరావు, వందేమాతరం శ్రీనివాస్, చంద్రబోస్ తదితరులు హాజరయ్యారు.
హాజరైన పారిశ్రామికరగం ప్రముఖులు:
జూపల్లి రామేశ్వరరావు, గ్రంథి మల్లికార్జునరావు, గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, పొట్లూరి వర ప్రసాద్, ప్రముఖ వైద్యులు పావులూరి కృష్ణ చౌదరి, ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more