ఇండియాలో ఇప్పుడు రాజమౌళి ఓ టాప్ మోస్ట్ డైరెక్టర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఈ మధ్య ఓ చేసిన ట్వీట్ మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు రామ్ చరణ్.. మరోవైపు ఎన్టీఆర్ లతో రీసెంట్ గా రాజమౌళి ఓ ఫోటో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని చెప్పేందుకు ఇది హింట్ ఇచ్చాడని అనుకున్నారు.
అయితే చరణ్- ఎన్టీఆర్ కాంబో అంటే కచ్చితంగా క్రేజీ కాంబినేషనే. చెర్రీ-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర.. ఇండస్ట్రీ రికార్డులు తుడిచేసింది. ఇక ఎన్టీఆర్ తో దర్శకధీరుడి సినిమాలు బ్లాక్ బస్టర్ లే. మరి ఇప్పుడు ముగ్గురు కలిసి సినిమా చేయడం అంటే కచ్చితంగా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్టు అయిపోతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు.
జనవరి నుంచి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే సినిమాను ప్రారంభించి దసరాకు రిలీజ్ చేసేందుకు చెర్రీ సిద్ధమయ్యాడు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ కోసం 4 నెలలకు పైగా సమయం వెయిట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అదయ్యాక కొరటాలతో ఓ సినిమాతో ఉంటుందని ఎన్టీఆర్ గతంలోనే ప్రకటించాడు. ఇక జక్కన్న తన తర్వాతి చిత్రం ఓ కమర్షియల్ అని చెప్పినప్పటికీ.. తర్వాత మహేష్ తో ఓ చిత్రం ఉంటుందని చెప్పాడు.
ఆ లెక్కన్న ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే వీరిద్దరి కాంబోలో చిత్రం ఉండే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఇండస్ట్రీ ఆల్ టైం హిట్ ను ఆశించొచ్చనే టాలీవుడ్ టాక్. ఒకవేళ ఆ కమర్షియల్ చిత్రం ఇదే అయితే మాత్రం వచ్చే ఏడాది చివర్లోనే ఇది మొదలయ్యే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more