సౌత్ లో దాదాపు భాషల్లో నటించిన లక్ష్మీ రాయ్ తర్వాత రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్నప్పటికీ ఫేట్ మాత్రం మారలేదు. ఈ నేపథ్యంలో బోల్డ్ ట్రయల్స్ తో జూలీ 2 చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. త్వరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అయితే అప్పట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో నడిచిన అఫైర్ గురించి ప్రస్తావనకు తీసుకొచ్చింది.
ఈ వ్యవహారం గురించి ప్రస్తావించిన జర్నలిస్ట్ తో... ధోనీ ఎవరు? అని ప్రశ్నించింది. అయితే ధోనీ గురించి తనను, తన గురించి ధోనీని ప్రశ్నించడానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని మీడియాకు రాయ్ లక్ష్మీ విజ్నప్తి చేసింది. కొన్ని విషయాలు వర్కౌట్ కావని పేర్కొంది. వాటిని వదిలేసి ముందుకు సాగాల్సిందేనని తెలిపింది. తమ మధ్యనున్న అనుబంధం గురించి మీడియా ఎక్కువ ఫోకస్ చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది స్పాట్ లైట్ అనే వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పొడగరి బ్యూటీ చెప్పుకొచ్చింది.
ఒకానోక టైంలో తామిద్దరం వివాహం చేసుకుంటున్నట్టు కథనాలు అల్లేశారని తెలిపింది. వాటివల్ల తామిద్దరం ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపింది. అందుకనే అప్పట్లో దీని గురించి పెద్దగా మాట్లాడలేదని తెలిపింది. ధోనీ అంటే ఇప్పటికీ గౌరవముందని, అందుకే దీని గురించి పెద్దగా మాట్లాడడం లేదని తెలిపింది. తమ మధ్య చోటుచేసుకున్న సంఘటన చాలా కాలం కిందటి సంగతని తెలిపింది. ఇప్పుడతను వివాహం చేసుకుని, కుటుంబంతో ఆనందంగా ఉన్నాడని తెలిపింది. అతనికి పిల్లలు కూడా ఉన్నారని గుర్తుచేసింది.
కాగా, 2008 ఐపీఎల్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు లక్ష్మీ రాయ్ అంబాసిడర్ గా వ్వవహరించింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగటంతో మీడియాలో రకరకాల కథనాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడసలు ఆ టాపిక్ తెరపైకి రావటానికి రాయ్ లక్ష్మీ చిత్ర ప్రమోషన్ థాట్ అసలు ఉద్దేశ్యం అయి ఉండొచ్చని పలువురు కామెంట్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more