మోగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీతో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటిచెప్పారు. ఖైదీ నెంబరు 150 తరువాత తాజాగా స్వతంత్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' చిత్రాన్ని ఆయన తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి చిరంజీవి మాట్లాడారు. జరిగిన చరిత్రను సినిమాగా తీయడమనేది అంత తేలికైన విషయం కాదనీ, అది ఎంతో శ్రమతో కూడుకున్నదని చిరంజీవి అన్నారు.
'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' చరిత్రను ఎంతో జాగ్రత్తగా పరిశీలించి ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథను అందించారని చెప్పారు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఎంతగానో పరిశోధించి, ఈ సినిమాకి స్క్రీన్ ప్లేను సమకూర్చాడనీ అన్నారు. ఈ సినిమాకి జాతీయ స్థాయిలో మార్కెట్ చేసే సత్తా ఉందనీ, అందువల్లనే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. మెగా అభిమానుల అంచనాలను అందుకునేలా ఈ సినిమా రూపొందుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more