క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. జనవరి 12 సినిమాను విడుదల చేయాలని క్రిష్ తదితరులు భావించారు. రిలీజ్ డేట్ లో కాస్త సస్పెన్స్ ఉన్నప్పటికీ, ఆడియో వేడుక కోసం మాత్రం ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు జరిగిపోయాయి. డిసెంబర్ 16న తిరుపతిలోని బసవతారకమ్మ స్టేడియంలో ఏర్పాట్లు ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నద్ధం అయ్యారు. అయితే మరోసారి డేట్ మారినట్లు అఫీషియల్ గా చిత్ర నిర్మాతలు ప్రకటించేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రబాబు నాయుడు .. వెంకయ్య నాయుడుతో పాటు చిత్రంలో రాజమాత గౌతమి పాత్ర పోషించిన హేమమాలినిలను ఆహ్వానించాలని ఫ్లాన్ చేసుకోగా, ఆరోజు వారికి కుదరకపోవచ్చని చెప్పారంట. దీంతో ఆడియోను 24కు షిఫ్ట్ చేసేసింది చిత్ర యూనిట్. అయితే అభిమానులను ఏ మాత్రం నిరాశపరచకుండా 16వ తేదీన మాత్రం ట్రైలర్ ను వదలాలని నిర్ణయించుకున్నారట.
నిజానికి ఈరోజే ట్రైలర్ వదలాలని నిర్ణయించుకున్నప్పటికీ, ధృవ రిలీజ్ అవుతుండటం, పైగా థియేటర్లలో చిరు టీజర్ ను ప్రదర్శిస్తుండటంతో వాయిదా వేసుకుంది తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కంచె సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more