ఓ సినిమా వెనుక కష్టం సమిష్టిదే అయినప్పటికీ ఇప్పుడున్న జనరేషన్ లో ఒకరిద్దరికే ఆ గౌరవం దక్కుతోంది. ముఖ్యంగా మూల కారకుడు రచయితకు సరైన గౌరవం దక్కట్లేదన్నది పచ్చి నిజం. హీరోలు, ఆ తర్వాత డైరక్టర్ల డామినేషన్ మీదే సినిమాలు సాగుతున్నాయి. అయితే ఒకప్పుటి పరిస్థితి వివరిస్తూ రైటర్ కమ్ నటుడు తనికెళ్ల భరణి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... దాసరి నారాయణరావు అనే మహానుభావుడి వల్లే రచయితకు ఒక గౌరవం వచ్చిందని తెలిపాడు. రచయితలను గౌరవించటం, వారికి దర్శకుడితో సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వటం, పోస్టర్లపై పేరు వేయించటం ఆయనే మొదలుపెట్టింది. దాసరి తీసుకువచ్చిన ఆ గౌరవాన్ని తర్వాత కొందరు ఉన్నత శిఖరాలకు చేర్చిన వాళ్లు పోసాని, చిన్నికృష్ణలాంటి వాళ్లు.
కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏదైనా తేడా వస్తే కనుక ఆ రచయితే డైరెక్టర్ అయిపోతున్నాడు. సినిమా పోస్టర్ మీద రైటర్ పేరు ఉండకపోవడమనేది చాలా బాధాకరమైన విషయం. దర్శకుడు రాంగోపాల్ వర్మ అంతటి వాడు ఏమన్నాడంటే.. ‘రైటర్స్ ఆర్ క్రియేటర్స్, వీ ఆర్ రీ క్రియేటర్స్’ అన్నారు. ఒక సినిమాకు దర్శకుడు ఎంత ముఖ్యమో, రచయిత కూడా అంతే ముఖ్యం. దర్శకుడి పేరు పక్కన రచయిత పేరు కూడా ఉండి తీరాలి అనేది నా కోరిక’ అంటూ తనికెళ్ల భరణి చెప్పుకొచ్చాడు. అయితే ఆ పరిస్థితి లేకపోవటం మూలంగానే రచయితలు దర్శకులుగా మారిపోతున్నారన్నది తెలియంది కాదని, కానీ, ఈ పరిస్థితిలో మార్పు అవసరమని ఆయన అభిప్రాయపడ్డాడు.
అసలు పేరు ఏంటంటే...
ఆ సీనియర్ రచయితకు తల్లిదండ్రులు పెట్టిన పేరు తనికెళ్ల దశ భరణి. అయితే స్కూల్లో తోటి పిల్లలు మరో అర్థం వచ్చేలా రకరకాలుగా పిలిచే వారంట, దీంతో తన పేరు ఎడిట్ చేసుకుని తనికెళ్ల భరణిగా మార్చుకున్నానని ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి అన్నారు. హరికథల చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని చెప్పిన ఆయన, వాళ్లను ఇమిటేట్ చేసి ఆపై నటనలో అవకాశం కొట్టేశానని చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more