ఈసారి దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇవ్వబోయే దెబ్బకి బ్రహ్మాండమే బద్ధలు కాబోతుంది. అవును... ఏకంగా న్యూక్లియర్ బాంబు మీదే వర్మ ఓ ఇంటర్నేషనల్ సినిమా తీయబోతున్నాడు. ఇందుకోసం అయ్యే బడ్జెట్ 340 కోట్లు. ఇదేదో వెతకారం అనుకునేరు. నిజంగానే నిజం.
సీఎంఏ గ్లోబల్ అనే ప్రతిష్టాత్మక సంస్థ వర్మతో ఈ ప్రయోగం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దేశం దేశాన్నే నాశనం చేయగల సత్తా న్యూక్లియర్ బాంబుది. ఒకవేళ టెర్రరిస్టుల చేతికి ఆ బాంబు వెళ్లి.. అది దుర్వినియోగం అయితే... మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ప్రపంచం నాశనమవుతుంది. అదే ఈ సినిమాలోని కథ’ అని వర్మ అంటున్నాడు.
అంతేకాదు టైటిల్ ను ఆవిష్కరిస్తూ ఓ పోస్టర్ ను కూడా వదిలాడు. ఓ హైవేపై ఎడ్ల బండి, సైకిల్ మీద వెళ్తున్న కుర్రాడు, దూరంగా అణు బాంబు పేలటం ఆ పోస్టర్ లో తన క్రియేటివిటీని చూపించాడు. న్యూక్లియర్-ద బిగినింగ్ ఆఫ్ వరల్డ్ వార్ 3 అనే ట్యాగ్ లైన్ తో సినిమా రానుంది. కశ్మీర్ వ్యవహారంలో అమెరికా ఇన్ వాల్వ్ కావటం, ఆపై ముంబైలో అణు బాంబు పడి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయటం, ఆపై కోట్ల జీవితాలు ఎదుర్కున్న పరిస్థితులు టోటల్ గా ఇదే కథ అని వర్మ అనౌన్స్ చేశాడు కూడా.
అంతేకాదు ఈ చిత్రం తర్వాత ది డెడ్ ఆర్ ఎలైవ్ అనే భయానక చిత్రాన్ని, ది ట్యాబ్ లెట్ అనే మరో సైన్స్ ఫిక్షన్ చిత్రాలను కూడా వర్మతోనే నిర్మించేందుకు సదరు సంస్థ సిద్ధమైపోయింది. ఇకపోతే న్యూక్లియర్ సినిమా కోసం అమెరికా, రష్యా, యమెన్, ఇండియా దేశాల్లో చిత్రీకరిస్తామని, ఇందులో ఇండియా, అమెరికా, చైనా, రష్యా నటులు నటిస్తారని వర్మ పేర్కొన్నాడు. బాహుబలి, రోబో 2.0 లే ఇప్పటిదాకా ఇండియాలో భారీ బడ్జెట్ సినిమాలు అని ఫీలవుతుంటే.. వర్మను నమ్మి 340 కోట్లు కుమ్మరించడటం అంటే మాటలు కాదు. అన్నట్లు స్టార్ల రెమ్యునరేషన్లు లేకుండా ఓన్లీ బడ్జెట్ మాత్రమే అంతనంట. సర్కార్ 3 తర్వాత దీనిని మొదలుపెట్టనున్నట్లు అల్రెడీ చెప్పేశాడు కూడా.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more