తెలుగు సినిమా సత్తాను చాటిన రాజమౌళిని పద్మశ్రీ వరించింది. అయితే పద్మశ్రీ కోసం తెలుగు రాష్ట్రలు రెకమెండ్ చెయ్యలేదు. మరి తెలుగు సినిమా ప్రతిష్టను పెంచిన దర్శక ధీరుడికి పద్మశ్రీ ఇవ్వాలని ప్రతిపాదించింది ఎవరో తెలుసా..? కర్ణాటక ప్రభుత్వం. అవును కర్ణాటక ప్రభుత్వం రాజమౌళికి పద్మ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించిందట. రాజమౌళి దీని మీద స్పందిస్తూ.. తాజాగా ట్వీట్ చేశారు. నిజానికి రాజమౌళి తాను పుట్టింది.. కర్ణాటకలో కాగా ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్నానని, తమిళనాడులో పనిచేశానని, తెలంగాణలో సెటిల్ అయ్యానని.. కాగా అన్ని రాష్ట్రాలకు కొడుకుగా గుర్తింపుతెచ్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశారు.
అయితే తనకు పద్మశ్రీ అవార్డు రావడం మీద తన ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం తన పేరును రెకమెండ్ చెయ్యడం ఆశ్యర్యాన్ని కలిగించిదని ట్విట్టర్ లో సోస్ట్ చేశాడు. అంతకు ముందు ఏపి రాష్ట్ర ప్రభుత్వం తన పేరును ప్రతిపాదించగా దానికి తాను ఒప్పుకోలేదని కానీ ఏపి మాత్రం తన పేరును ప్రతిపాదించిందని అన్నారు.
పద్మశ్రీ అవార్డు తనకు దక్కడంపై రాజమౌళి ఈ విధంగా ట్వీట్ చేసారు. ‘‘నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మిక్స్డ్ ఫీలింగ్ లో ఉన్నాను. నిజానికి ఈ పద్మశ్రీ అవార్డు అందుకోవడానికి నేను అర్హుడిని అని అనుకోవడం లేదు. ఏదో వినయం కోసం ఈ మాటలు చెప్పడంలేదు. ఇప్పటిదాకా నేను ఏం చేసాను, ఏం సాధించాను అనేది నాకు తెలుసు. ఈ అవార్డు అందుకునేలా కళారంగంలో నా గొప్పతనాన్ని ఏమి చూపలేదు. రామోజీరావు మరియు రజినీకాంత్ లకి పద్మ విభూషణ్ లు రావడం చాలా పర్ఫెక్ట్. ఇలాంటి లెజెండ్స్ తో కలిసి ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని’’ రాజమౌళి ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more