చెన్నలో వరద బాధితుల్లో మాములు ప్రజలే కాకుండా సినీతారలు, పలువురు ప్రముఖులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇందులో కోలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఫ్యామిలీ కూడా ఒకరు. ఈమె ప్రముఖ సీనియర్ నటి మేనక వారసురాలు. తన బామ్మ బ్రతకడానికి గల కారణం తాను నటించిన కొత్త చిత్రమేనని చెబుతోంది కీర్తి.
తమిళంలో కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం ‘రజనీ మురుగన్’. శివకార్తీకేయన్, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 4వ తేదిన విడుదల కావాల్సి వుంది. కానీ తన బామ్మకు గత నెల 30వ తేదిన నగరంలోని ఓ హాస్పిటల్లో శస్త్ర చికిత్స చేయడానికి వైద్యులు నిర్ణయించారు. అయితే తన బామ్మ మాత్రం తాను నటించిన ‘రజనీ మురుగన్’ చిత్రం చూసిన తర్వాతనే ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పింది. దీంతో వైద్యులను రిక్వెస్ట్ చేసి, ఆపరేషన్ ను ఒకరోజు వాయిదా వేయాలని కోరాము అని తెలిపింది కీర్తి.
బామ్మ కోరిక మేరకు నవంబర్ 30న ‘రజనీమురుగన్’ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన ద్వారా చూసాము. ఆ సినిమా చూసి తన ఫ్యామిలీ, మరియు బామ్మ తన నటనను ప్రశంసించారని చెప్పింది. అయితే అదే రోజున భారీగా వర్షం పడటంతో హాస్పిటల్లోని జనరేటర్ లో వాటర్ బాగా చేరడంతో బామ్మకు ఆపరేషన్ జరగలేదు. దీంతో అక్కడ తినడానికి కూడా ఏమి దొరకకపోవడంతో బయట షాపులో బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ కొనుక్కుని ఇంటికి వెళ్లిపోయామని తెలిపింది.
ఆ తర్వాత పేపర్ లో చూస్తే మియాట్ హాస్పిటల్లో 18 మంది మరణించారని తెలిసి అందరం షాక్ అయ్యాం. ఒకవిధంగా చెప్పాలంటే మా బ్రతికిందంటే దానికి వర్షం, మరియు నా సినిమాయే కారణమని చెబుతోంది కీర్తి సురేష్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more