ఓంకార్ దర్శకత్వం వహించిన సినిమా రాజుగారి గది. వారాహి చలనచిత్రం, ఏకే ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా విడుదల చేశాయి. అశ్విన్ బాబు, చేతన్, ధన్య బాలకృష్ణన్, పూర్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ హైదరాబాద్లో గురువారం ప్రెస్మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓంకార్, అశ్విన్, అనిల్ సుంకర, సాయికార్తీక్, సాయి కొర్రపాటి పాల్గొన్నారు.
ఓంకార్ మాట్లాడుతూ ``ఈ సినిమా ఫస్ట్ వీక్ చాలా తక్కువ థియేటర్లలో విడుదలైంది. థియేటర్ల సంఖ్యను చూసి మా టీమ్తో సహా చాలా మంది బాధపడ్డారు. సినిమాను దసరాకు విడుదల చేయడం అంత తేలిక కాదని నాక్కూడా తెలుసు. ఈ నెల 30న ఓవర్సీస్లో సినిమాను విడుదల చేస్తున్నాం. సినిమా పైరసీని చూడవద్దు. థియేటర్లో జనాల మధ్య చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. శుక్రవారం వైజాగ్ నుంచి టూర్ను మొదలుపెడతాం. సింహాచలంలో దర్శనం చేసుకున్నాక వైజాగ్, అన్నవరం, కాకినాడ, రామచంద్రాపురం, రాజమండ్రి, అమలాపురంలో తిరుగుతాం. ఆ తర్వాత ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలిలో పర్యటిస్తాం. ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఒక రోజు, కడప, కర్నూల్, నంద్యాల ఒక రోజు తిరుగుతాం. మిగిలిన ప్రాంతాలకు మరోసారి వెళ్తాం`` అని చెప్పారు.
సాయికార్తిక్ మాట్లాడుతూ ``తెరవెనుక ఉన్న టెక్నీషియన్లను తెర ముందుకు తీసుకుని రావడంలో ఓంకార్ కృషి చాలా గొప్పది`` అని అన్నారు.
అనిల్ సుంకర మాట్లాడుతూ ``దయచేసి పైరసీ సీడీలను చూడవద్దు. ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్లో కసితో తీశారు. ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. ఓంకార్ చాలా రిచ్గా తీశారు. 30 నుంచి థియేటర్ల సంఖ్యను డబుల్ చేస్తున్నాం. సినిమా హిట్ అయ్యేసరికి చాలా మంది ఫోన్లు చేసి విష్ చేస్తున్నారు`` అని తెలిపారు.
అశ్విన్ బాబు మాట్లాడుతూ ``ఎంతో అదృష్టం ఉంటే గానీ నా సినిమా దసరాకు విడుదలై ఉండదు. అనిల్ గారికి, సాయిగారికి ధన్యవాదాలు`` అని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more