ప్రముఖ నటుడు, నిర్మాత కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు త్వరలోనే మరోసారి తన నటనతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంపై మోహన్ బాబు తాజాగా ఓ క్లారిటీ ఇచ్చేసారు. మోహన్ బాబు నటించిన ‘పెదరాయుడు’ చిత్రం ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా... ఆయన తన కొత్త సినిమా విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఇటీవలే ఓ మరాఠీ చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్ హక్కులను తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు.
ఈ రీమేక్ చిత్రానికి ప్రముఖ కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారని మోహన్ బాబు తెలిపారు. అయితే ఆ మరాఠీ సినిమా ఏదై వుంటుందా అని సినీవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఆ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more