భారతీయ చిత్రపరిశ్రమలో మునెపెన్నడూలేని విధంగా అత్యంత భారీ బడ్జెట్ తో ‘బాహుబలి’ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. తాజాగా ఆడియోని విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ మూవీ ఆడియో వేడుక మే 31న హైదరాబాద్ లో జరగాల్సింది కానీ.. ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ మూవీ ఆడియో వేడుకను తిరుపతికి మార్చారు. ఈ క్రమంలోనే అక్కడ ఎస్వీ యూనివర్శిటీ గ్రౌండ్స్లో ఈ వేడుక ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.
ఈ ఆడియో వేడుక నిర్వహణను రాజమౌళి బాహుబలి టీం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజమౌళితో పాటు ప్రధాన యూనిట్ మెంబర్స్ అంతా అక్కడే తిష్టవేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆడియో వేడుకను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు పూర్తిస్థాయి వ్యూహంతో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భద్రతా ప్రణామాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కట్టుదిట్టంగా చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ వేడుకలో భాగంగా అక్కడ చేసిన అరేంజ్ మెంట్స్ ఎంతో అద్భుతంగా వున్నాయి. భారీ ఖర్చు పెట్టిన తయారుచేసిన ఈ వేడుక సెట్స్ చూడటానికి అంగరంగ వైభవంగా వున్నాయని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ వేడుక కూడా హైలైట్ గా నిలిచిపోతుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం!
ఇదిలావుండగా.. బాహుబలి ఆడియో వేడుక ఏర్పాట్ల గురించి రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ.. ఓ హెచ్చరిక కూడా జారీ చేశాడు. బాహుబలి ఆడియో వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పోలీస్ డిపార్టుమెంట్, బాహుబలి టీం సంయుక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేడుకకు చిన్న పిల్లలను, పెద్దవారిని తీసుకురావొద్దని రాజమౌళి అభిమానులకు విన్నవించారు. అలాగే.. ఈ వేడుకకు సంబంధించిన పాసులు తాము అమ్మడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా అమ్మితే.. వాటిని కొనద్దని ఆయన సూచించారు. అలా కొంటే.. కొన్నవాళ్లు మోసపోయినట్లేనని, కాబట్టి డూప్లికేట్ పాసులు ఎట్టిపరిస్థితుల్లో కొనవద్దని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆడియో వేడుకకు సంబంధించిన పాసులను తాము ప్రభాస్ అభిమాన సంఘాలకు స్వయంగా అందించినట్లుగా రాజమౌళి తెలిపారు. అభిమాన సంఘాల అధ్యక్షులు, రానా మేనేజర్స్ వద్ద పాసులు లభిస్తున్నాయని.. అక్కడి నుంచి పాసులు తీసుకుని వేడుకకు హాజరవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more