అనుకున్నట్లే అయ్యింది. మరికొద్ది రోజుల్లో ట్రైలర్, పాటలు విడుదల కాబోతుందని తెలిసి ఆనందపడిన వారందరికి ‘బాహుబలి’ చిత్ర యూనిట్ నిరాశనే మిగిల్చారు. మొత్తానికి ‘బాహుబలి’ ఆడియో విడుదల వాయిదా పడిపోయింది. వాయిదా పడటానికి కారణాలు ఏమైనా కూడా... అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో వున్నారు. అటు ప్రభాస్ అభిమానులు, ఇటు ‘బాహుబలి’ చిత్ర అభిమానులు ఈ సినిమా కోసం గతకొద్ది కాలంగా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూనే వున్నారు.
ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సినీ అభిమానులు భారీ అంచనాలు పెంచేసుకున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ఈనెల 31న హైద్రాబాద్లోని హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్లో అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున, చాలా గ్రాండ్ గా నిర్వహించాలనుకున్నారు. కానీ ఈ ఆడియో విడుదలను చిత్ర యూనిట్ వాయిదా వేసారు. ఈ విషయంపై తాజాగా ‘బాహుబలి’ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.
ఈ సంధర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ... ‘ముందుగా ‘బాహుబలి’ అభిమానులకు, ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈనెల 31న బాహుబలి ఆడియో విడుదల అయ్యేది. కానీ ఓపెన్ గ్రౌండ్స్ లో నిర్వహించే ఆడియో ఫంక్షన్ల విషయంలో కొన్ని భాధాకర సంఘటనలు జరిగాయి. వాటన్నీంటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కొన్ని పరిమితులు విధించారు. ‘బాహుబలి’ సినిమా కోసం, అలాగే ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు ఎంతో మంది అభిమానులు హాజరయ్యే అవకాశం వుంది కాబట్టి... ఇలాంటి వేడుకలో ఏదైన జరగరానిది జరిగితే అందరం బాధపడాల్సి వుంటుంది. అందుకే వాటన్నీంటిని దృష్టిలో పెట్టుకొని ఆడియో విడుదలను వాయిదా వేశాం. మరికొద్ది రోజుల్లోనే అన్ని వివరాలు ప్రకటిస్తాం’ అని చెప్పుకొచ్చారు.
హీరో ప్రభాస్ మాట్లాడుతూ... ‘ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఆడియో వేడుకను ‘బాహుబలి’ చిత్ర యూనిట్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు. కానీ ఎవరికి ఏం జరగకుండా, అందరూ సంతృప్తి చెందే విధంగా ఈ వేడుకను నిర్వహించాలనుకుంటున్నాం. అందుకే పోలీసులు చెప్పిన పరిమితులు కూడా సరైనవే. కానీ అందరూ ఈ ఆడియో వేడుక వలన సంతృప్తి చేందాలనే ఉద్దేశ్యంతో ఆడియో వేడుకను వాయిదా వేయడం జరిగింది. రేపు లేదో ఆ తర్వాత రోజు ఆడియో వేడుక గురించి ప్లాన్ చేసి తెలియజేస్తాం. మరోసారి అందరికి క్షమాపణలు చెబుతున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ... అభిమానులందరికీ క్షమాపణలు. త్వరలోనే కొత్త ఆడియో రిలీజ్ డేట్ ప్లాన్ చేసి తెలియజేస్తామని చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more