ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లండన్లోని ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంను సందర్శించేవారికి ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ కనువిందు చేయబోతోంది. కత్రినా రూపాన్ని కళ్లముందు ఆవిష్కరించేలా ఆమె మైనపుబొమ్మను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అమితాబ్, ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ ప్రముఖుల మైనపు బొమ్మలు ఇప్పటికే లండన్ మ్యూజియంలో కొలువుదీరాయి. 2003లో బూమ్ సినిమాతో బాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేసిన కత్రినా ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 2008లో కత్రినా ఆసియా సెక్సీయెస్ట్ ఉమెన్ గా కూడా ఎన్నుకోబడింది. గూగుల్ లో ఎక్కువ మంది వెతికిన సెలబ్రెటీల్లో కత్రినా పేరు ఖచ్చితంగా ఉంటుంది.
అయితే లండన్లోని ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియం కత్రినా బొమ్మను చూసిన వారికి చిక్నీ చమేలీ..’, ‘షీలాకీ జవానీ’ పాటలు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. షీలా కీ జవానీ అంటూ కుర్రకారును ఊపి, చిక్ నీ చమేలీ పాటతో అందరిని అలరించింది. అయితే బాలీవుడ్లోకి రాకముందు కత్రినా చాలాకాలం పాటు లండన్లోనే నివసించింది. లండన్ మ్యూజియంలో తన మైనపుబొమ్మను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం కలిగిస్తోందని ఆమె ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇది తనకు లభించిన ప్రత్యేక గౌరవం అని అభివర్ణిస్తోంది. ఎంతో ప్రసిద్ధి చెందిన ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలో అమితాబ్, ఐశ్వర్య,సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, కరీనా కపూర్ మైనపుబొమ్మల సరసన తన మైనపు బొమ్మను కూడా ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని కత్రినా అంటోంది. మొత్తానికి బాలీవుడ్ అగ్రనటుల మైనపు బొమ్మల సరసన మరో నటి విగ్రహం వచ్చి చేరింది. కాగా కత్రినా విగ్రహం చాలా స్టైలిష్ గా కనిపిస్తుండటం విశేషం.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more