Sriya saran sent srikrishna and gautam buddh paintings to art exhibition for hudhud victims

sriya saran, shriya saran, sriya saran latest news, sriya saran hot photos, sriya saran paintings, sriya saran latest news, sriya saran hot gallery, sriya saran photo shoot, sriya saran hudhud victims, vizag hudhud victims, andhra pradesh government, hyderabad art exhibitions

sriya saran sent srikrishna and gautam buddh paintings to art exhibition for hudhud victims

వైజాగ్ కోసం వయ్యారిభామ ఏంచేసిందో తెలుసా?

Posted: 11/08/2014 11:12 AM IST
Sriya saran sent srikrishna and gautam buddh paintings to art exhibition for hudhud victims

మొన్న వచ్చిన హుధుద్ తుపాను కారణంగా వైజాగ్ నగరం మొత్తం అతలాకుతలమైన సంగతి తెలిసిందే! ప్రాణనష్టం అంతగా జరగలేదు కానీ... ఆస్తినష్టం భారీగానే జరిగింది. దీంతో అక్కడున్న ప్రజలందరూ నిరాశ్రయులై, ఆకలితో అలమటిస్తున్నారు. అయితే వీరందరి క్షేమం కోసం ఏపీ ప్రభుత్వం గట్టిగానే శ్రమిస్తోంది. మరోవైపు టాలీవుడ్ లో వున్న ప్రముఖులనుంచి చిన్న ఆర్టిస్టులవరకు తమవంతు సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు. కొందరు డబ్బులరూపంలో విరాళాలు సమర్పిస్తుంటే.. మరికొందరు నేరుగా రంగంలోకి దిగి అక్కడున్న ప్రజలకు ఫుడ్ ప్యాకెట్స్, వాటర్, బిస్కెట్స్ ఇలా రకరకాల ఆహారపదార్థాలను సర్వ్ చేస్తున్నారు.

అయితే మూడుపదుల హాట్ భామ శ్రియ శరన్ ఏం చేసిందో తెలుసా..? ఆ విషయం గురించి చర్చించుకోవాలంటే ముందుగా శ్రియ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి వుంటుంది. ఇన్నాళ్లవరకు శ్రియా తెరమీద కేవలం హీరోయిన్ గా మాత్రమే అందరికీ పరిచయమైంది.. రియల్ లైఫ్ ఆమె స్వభావం ఏమిటి..? ఇష్టాయిష్టాలేంటి..? వారిలో దాగివున్న ప్రతిభలేంటి..? అనే విషయాలు అంతగా బయటకు రాలేదు. ఆ విషయాలను ఆమె ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. అయితే హుధుధ్ బాధితుల కోసం ఆమె తనలో దాగివున్న కళను బయటపెట్టింది. అందరి తారలకంటే భిన్నమైన పద్ధతిలో ఆమె బాధితుల కోసం విరాళాలు సేకరించే పనిలో మునిగిపోయింది.

శ్రియా కేవలం అందమైన హీరోయిన్ మాత్రమే కాదు.. అందంగా బొమ్మలు వేసే ఒక పెయింటర్ కూడా! చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా నేర్చుకున్న ఈ కళను ఏనాడూ తెలియపరచలేదు కానీ.. ఇప్పుడు ఆ కళకు పనిచెప్పింది. ఉత్తరాంధ్రను పూర్తిగా కుదిపేసి హుధుద్ తుపాను బాధితుల సహాయం కోసం ఈమె చాలారోజుల తర్వాత మళ్లీ కుంచె పట్టింది. శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడి పెయింటింగులు వేసి.. బాధితుల సహాయనిధికి ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ కు పంపించింది. ఆదివారం (09-11-2014)నాడు హైదరాబాదులో జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలో ఈ బొమ్మలను కూడా చూపిస్తారు.

ఈ విషయమై శ్రియ మాట్లాడుతూ.. ‘‘విశాక నగరంతో నాకు ఎంతో అనుబంధం వుంది. నటిగా నేను మొట్టమొదటిసారిగా కెమెరా ముందు నిలబడింది అరకులోయలోనే. అంతేకాదు.. అక్కడి ప్రేక్షకులు కూడా నన్ను ఎంతగానో అభిమానిస్తారు. అందుకే.. ఆ ప్రాంతం సహాయార్థం ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని చెప్పగానే నేను వేసిన రెండు పెయింటింగులు పంపించాను’’ అని చెప్పింది ఈ అందాలతార. మరి.. శ్రియా వేసిన ఈ పెయింటింగులు ఏ రేటుకి అమ్ముడుపోతాయో చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles