దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ’ సినిమా షూటింగుకు సంబంధించిన యుద్ద సన్నివేశాలను గత కొంత కాలంగా హాలీవుడ్ రేంజ్ లో వివిధ ప్రదేశాలలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఈ యుద్ద సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన తెలిపాడు. ఈ సినిమాలో అత్యధిక భాగం యుద్ద సన్నివేశాలు సంబంధించిన షెడ్యూల్ ని పూర్తి చేశామని, ఈ సన్నివేశాలను విజయవంతంగా పూర్తి చేయడంలో యూనిట్ సహాకారం మరవ లేనిదని, మాటల్లో చెప్పలేనిదని ఆయన అన్నారు.
చిత్ర యూనిట్ లోని ప్రతి ఒక్కరు ఉత్సాహంతో పనిచేశారు. వారి సహకారం లేకపోతే ఇంత తొందరగా పూర్తయ్యేది కాదు అని అన్నారు. విశాఖ పట్నంలో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నామని.. త్వరలోనే మరో షెడ్యూల్ ను ప్రారంభిస్తామని రాజమౌళి తెలిపారు. ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రం 2015లో విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more