దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి ఆశించిన స్థాయిలో పవనాలు అందకపోవడం.. అంతర్జాతీయంగా వస్తున్న బలహీన సంకేతాలకు ప్రాఫిట్ బుకింగ్ తోడవ్వడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెల 8 నుంచి లాభనష్టాల మధ్య ఊగిసలాడుతన్న మార్కెట్లు లాభాల కన్న నష్టాలనే అధికంగా మూటగట్టుకున్నాయి. దీంతో మదుపురులు కూడా మార్కెట్లలో పెట్టబడులు పెట్టేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఆటో కంపెనీల నవంబర్ నెల విక్రయ డేటా ఒక్కసారిగా కుప్పకూలడం, పోటీ తీవ్రతరమవడంతో వైరలెస్ ప్రొవేడర్ల షేర్లు అతలాకుతలమవడం మార్కెట్లను దెబ్బతీసింది. అమెరికా నెల వారీ ఉద్యోగ డేటా విడుదల, ఇటలీ తన రాజ్యాంగంపై రెఫరాండం, వచ్చే వారంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్య పాలసీ నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ స్తబ్దుగా కొనసాగుతున్నాయి. దీంతో ఉదయం ప్రారంభం నుంచే మార్కట్లు నష్టాల బాట పట్టాయి,
ఉదయం మార్కెట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టాపోయింది, అటు నిఫ్టీ కూడా 22 పాయింట్లకు పైగా దిగజారింది, ఆ తరువాత కూడా మార్కెట్లు ఏ కోశానా కోలుకోలేదు. అమ్మకాల ఒత్తిడితో మధ్యాహ్న సెషన్లో మరింత పడిపోయి వారం ముగింపులో భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. సెన్సెక్స్ ఒక్కసారిగా 329.26 పాయింట్లు కుప్పకూలి . నిఫ్టీ సైతం 106.10 పాయింట్లు పడిపోయి 8086.80గా క్లోజ్ అయింది. ఫలితంగా మార్కెట్ ముగిసే సమయానికి 329 పాయింట్ల నష్టంతో లాభంతో26,230.66 వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 106 పాయింట్లను కోల్పోయింది దీంతో నిఫ్టీ కూడా 8087 పాయింట్లకు దిగజారింది.
దీనికి తోడు భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించనుండంతో అటు బ్యాంకు రంగ సూచీలు కూడా నష్టాలను ఎదుర్కోన్నాయి, ఫలితంగా అన్ని రంగాల సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి, మరీ ముఖ్యంగా అటో, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, మిడ్ క్యాప్ నిఫ్టీలు భారీగా నష్టాలను ఎదుర్కోగా, ఎఫ్ఎంజీసీ, ఐటీ, మెటెల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్యలు కూడా నష్టాలల్లో ముగిసాయి, ఈ క్రమంలో ఏషియర్ మోటార్స్, ఐడియా సెల్యూలార్, టాటా పవర్, సిప్లా, అల్ట్రా టెక్ సిమెంట్ తదితర సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, ఏఫియన్ పెయింట్స్, మారుతి సుజుకీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, బిపిసీఎల్ సంస్థల షేర్లు నష్టాలను ఎదుర్కోన్నాయి.
(And get your daily news straight to your inbox)
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more
Jul 15 | రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్... Read more