అమెరికా ఫెడరల్ రిజర్వు సమావేశం నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఫెడ్ రిజర్వు నిర్ణయాలపై స్వర్ణం ధరల కూడా నిర్ధేశించబడుతుంది. ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంటే భారత్లో పది గ్రాముల బంగారం ధర 20,500 రూపాయలకు పడిపోయే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. ఇవాళ ముగియనున్న ఫెడ్ సమావేశం ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందోనన్ని ఆసక్తి సర్వత్రా నెలకోనగా, ఫెడ్ నిర్ణయాన్ని అనుసరించి బంగారం ధర తగ్గుతుందా..? లేక పెరుగుతుందా అన్న విషయమై క్లారీటీ వస్తుందని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. ఫెడ్ నిర్ణయం మేరకు సమీప భవిష్యత్లో 20,500- 24,000 రూపాయల మధ్య కదలాడవచ్చని పేర్కొంది.
ప్రస్తుతానికి బంగారంపై నెగిటివ్ ఔట్లుక్ను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఫెడ్ నిర్ణయాన్ని బట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 900-1050 డాలర్ల మధ్య కొనసాగవచ్చని అంచనావేసింది. అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితి తొలగేవరకు బంగారం ధరలు 2009 సంవత్సరానికి ముందరి స్థాయిలకు చేరే అవకాశాలు తక్కువని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి ఉన్న తరుణంలో బంగారం ధరలు పెరగడం, అనిశ్చితి తొలగే తరుణంలో బంగారం ధరలు తగ్గడం జరుగుతుంటాయని తెలిపింది.
యుఎస్ రియల్ వడ్డీరేట్లు, బంగారం ధరలు విలోమ సంబంధ కలిగి ఉంటాయని, అలాగే బంగారం, డాలర్ ఇండెక్స్ కూడా విలోమ సంబంధం కలిగి ఉంటాయని ఇండియా రేటింగ్స్ తన నివేదికలో తెలిపింది. ప్రపంచ బంగారం డిమాండ్లో దాదాపు సగం వాటా భారత్, చైనాలదేనని, ప్రస్తుతం ఈ రెండుదేశాలు 2011-12 కొనుగోలు స్థాయిలను మెయిన్టెయిన్ చేస్తున్నాయని తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనాలో బంగారం డిమాండ్ 8 శాతం క్షీణించగా, భారత్లో డిమాండ్ 15 శాతం పెరిగిందని తెలిపింది. అయితే నికరంగా చూస్తే ప్రస్తుతం భారత్లో డిమాండ్ ఆరేళ్ల కనిష్ఠ స్థాయిల వద్ద ఉందని తెలిపింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more
Jul 15 | రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్... Read more