గత వారంలో పతనాలతో నెల రోజుల కనిష్టస్థాయికి చేరిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతంలో లాభాలతో ముగిసాయి. ఇవాళ లాభాలతో పయనించిన స్టాక్ మార్కెట్లు ఐదు వారాల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. అయితే ఆరంభంలో సాధించిన లాభాలతో 28 వేల మార్కును తాకిన సెన్సెక్స్ ఆ తరువాత ఒడిదోడుల మధ్య అంతకు కొంత దిగువగానే ట్రేడింగ్ ముగించింది. విదేశీ మదుపురులు భారత్ స్టాక్ మార్కెట్ లలో పెట్టుబడులను పెట్టడంతోనే మార్కెట్లు లాభాల బాటలో పయనించాయిన మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వారు కేవలం సెంటిమెంట్ పునాదులపై పెట్టుబడులు పెట్టారని, అయితే దేశ ఆర్థిక పురగోతి, కార్పోరేట్ సంస్థల వాణిజ్య ప్రగతి అంశాలపై వారికి సందేహాలు మాత్రం కోనసాగుతునే వున్నాయని చెప్పారు. కాగా, ఇవాళ ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచే దేశీయ సూచీలు లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల వరకు లాభాలను ఆర్జించినా.. ఒడిదోడుకుల మద్య వాటిని నిలబెట్టుకోలేక 148 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది.
ఈ క్రమంలో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్ 148 పాయింట్లు లాభంతో 27 వేల 958 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, అటు నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 8 వేల 459 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమల సూచీలు లాభాలతో పయనించడంతో మార్కెట్ల లాభాలను ఆర్జించాయి మెటల్స్, బిఎస్ఈ బ్యాకెక్స్, కన్జూమర్ గూడ్స్ సూచీలు నష్టాలలో పయనించాయి. ఈ క్రమంలో హెచ్.డి.ఎఫ్.సి, టీసీఎస్, సన్ ఫార్మ, టెక్ మహీంద్ర, లుపిన్ తదితర సంస్థల షేర్లు లాభాలలో పయనించగా, అల్ట్రా టెక్ సిమెంట్, ఎస్ బి ఐ, ఐడియా సెల్యూలార్, హిండాల్కో, వెదాంత, తదితర సంస్థల షేర్లు అత్యధిక నష్టాలను చవిచూశాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more