దేశంలో ఎన్నో హిందూదేవాలయాలు వెలసినా.. వాటి ప్రముఖ్యతలు, విశిష్టతలు మాత్రం భక్తుల నోళ్లలో నానుతూ ఆచంద్రతారఖ్కంగా నిలుస్తున్నాయి. భక్తులు విశ్వాసాలకు పుట్టినిళ్లుగా మారిన దేవాలయాల్లో.. దేవుళ్లు స్వయంభువుగా వెలిస్తే.. మరికొన్ని ఆలయాలను భక్తులు దేవుడిపై వున్న తమ భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించారు. ఇలా నిర్మితమైన వాటిలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందినవి వున్నాయి. అలాంటి ఆలయాల్లో తిరుపతి వెంకటేశ్వర ఆలయం ఒకటి! ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వుండే భక్తులు వస్తుంటారు. పలు కీలక సందర్భాలలో మాత్రం బారులు తీరుతుంటారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి వైకుంఠంగా ప్రసిద్ది చెందిన తిరుమలకు వున్న విశిష్టత నేపథ్యంలో ఈ ఆలయ తరహాలోనే మరెన్నో ఆలయాలు పుట్టుకొచ్చాయి. సదరు దేవాలయాలకు ప్రత్యేకంగా పేర్లున్నప్పటికీ.. వాటికి గుర్తింపు మాత్రం ప్రసిద్ధ ఆలయాలతో పోలి వుంటుంది. అలాంటి ఆలయాల్లో శ్రీ వరాల వేంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి! ఆంధ్రరాష్ట్రంలో వున్న ఈ ఆలయం ‘బుల్లి తిరుపతి’గా ప్రసిద్ధి గాంచింది.
ఆలయ విశేషాలు :
ఈ దేవాలయం పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలోని ఈడూరులో నెలకొని ఉన్న ప్రసిద్ధ ఆలయం. 2005 ఫిబ్రవరి 17న శ్రీ భూనీలా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం నిర్మాణం జరిగింది. క్రమంగా స్వామివారి మహిమ గుర్తించిన భక్తులు.. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా కొలుస్తూ కోరిన వరాలు ఇచ్చే దేవునిగా ‘శ్రీ వరాలవేంకటేశ్వరుని’గా ప్రసిద్ధి చెందారు. మనసులో కొరిక తలచుకొని 11 ప్రదక్షిణలు చేసి ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి వారి మొక్కును చెల్లించుకోవడం ఇక్కడ ప్రజల ఆనవాయితీగా మారింది.
ముందుగా చిన్నగుడిగా నిర్మాణమైన ఈ ఆలయం.. దాతల సహకారంతో గుడిచుట్టూ ప్రాకారం, రాజగోపురం నిర్మాణం జరిగింది. రథోత్సవాల కోసం రథం తయారు చేయించారు. మకరతోరణం, గరుడవాహనం, శేషవాహనం కూడా స్వామి వారికి సమకూర్చడం జరిగింది. అందరికీ మంచి బుద్ధి సిద్ధించాలని, సర్వజనులు సుఖశాంతులతో ఉండాలని, ఆలయ దినదినాభివృద్ధి సాధించాలని ఈ ఆలయంలో ఓ ప్రత్యేక యాగం నిర్వహిస్తారు. ఈ యాగంలో పాలుపంచుకున్న దంపతులకు, సర్వులకు శ్రీవారి అనుగ్రహం వల్ల సర్వదోషాలు తొలిగి.. అన్నీ విధాల సుఖశాంతులతో జీవిస్తారని నమ్మకం.
ఇక ఆలయంలో ప్రతీ శనివారం విశేష అలంకారాలు, పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతీ నెలా వచ్చే శ్రవణా నక్షత్రం రోజున స్వామి వారికి కల్యాణం జరుపుతారు. ఈ కల్యాణం జరిపించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతాయని, పిల్లలు లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుంది, ఉద్యోగం లేనివారికి ఉద్యోగం, చదువు , ఆరోగ్యం, మొదలైన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more