రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో లేక్ పిచోలా ప్రాంతంలో వుండే తాజ్ లేక్ ప్యాలేస్ ఎంతో విలాసవంతమైన హోటల్. 83 గదులు, పాలరాతి గోడలతో కూడిన అధునాతన సూట్లు గల ఈ ప్యాలెస్ ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన 4ఎకరాల విస్తీర్ణంలోని ద్వీపంలో నిర్మించారు. ఈ ప్యాలెస్ ఓ విశేష గుర్తింపు వుంది. అదేమిటంటే.. కేవలం భారతదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే శృంగార హోటల్ గా ఈ ప్యాలెజ్ ప్రసిద్ధి గాంచింది.
ఈ ప్యాలెస్ లో అతిథ్యం పొందినవారిలో ప్రపంచదేశాధినేతలతోపాటు ఎందరో సినీ ప్రముఖులు కూడా వున్నారు. లార్డ్ కర్జన్, వీవీన్ లీ, ఎలిజెబెత్ రాణి, ఇరాన్ ఒకప్పటి రాజు, నేపాల్ రాజు, ఒకప్పటి అమెరికా ప్రథమ మహిళ జాక్వలిన్ కెన్నడి లాంటి వాళ్లంతా ఇందులో కొన్నాళ్లపాటు బస చేశారు.అంతేకాదు.. ఈ ప్యాలెస్ లో అనేక సినిమాలు కూడా షూటింగ్ జరుపుకున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన జేమ్స్ బాండ్ సిరీస్ లలో ఓ మూవీ, బ్రిటీష్ టీవీ సిరీస్, ఇతర హాలీవుడ్ చిత్రాలతోపాటు పలు హిందీ సినిమాల చిత్రీకరణలు జరిగాయి.
చరిత్ర :
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ రాజైన మహారాణా జగత్ సింగ్-II (మేవార్ రాజవంశస్థుల పాలనలో 62వ రాజు) ఈ అద్భుతమైన ప్యాలెస్ ను 1743-1746 మధ్యకాలంలో నిర్మించారు. వేసవికాలంలో తన విడిదిగా ఉపయోగించుకోవడం కోసం మాత్రమే ఆయన దీనిని అప్పట్లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, తనకు కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చుకునే విధంగా నిర్మించుకున్నారు. అప్పట్లో తమ రాజ దర్బార్లను కూడా ఇక్కడే నిర్వహించేవారు. దర్బార్ లోని అందమైన ఫిల్లర్లు, చూడముచ్చటైన పై అంతస్తుతో పాటు ఇక్కడి తోటలు ప్రత్యేక ఆకర్షణ నిస్తాయి. అప్పట్లో దీనిని ‘జగ్ నివాస్’ లేదా ‘జన్ నివాస్’ అని పిలిచేవారు.
ప్యాలెస్ విశేషాలు :
- హిందువుల ఆరాధ్య దైవమైన సూర్యున్ని నమస్కరించుకునేందుకు వీలుగా ఈ ప్యాలేస్ ను తూర్పు ముఖంగా నిర్మించారు. ఇప్పటికీ ఈ హోటల్ సన్ బాత్ కు, సూర్య నమస్కారాలకు ప్రసిద్ధి గాంచింది.
- లేక్ ప్యాలేస్ లో రాజుల కాలం నాడు బట్లర్లుగా పనిచేసిన వారి వారసులు ఇప్పటికీ ఇక్కడ ‘రాయల్ బట్లర్లు’ గా పనిచేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన అతిథులకు వీరంతా రాచ మర్యాదలు అందిస్తారు.
- ప్యాలేస్ లోని పై గది దాదాపు 21 అడుగుల వ్యాసంతో పూర్తి వృత్తాకారంలో ఉంటుంది. దీని ఫ్లోరింగ్ మొత్తం నలుపు, తెలుపు రంగు పాలరాతితో పరిచారు. అదేవిధంగా ప్యాలేస్ గోడలు రంగురంగుల ఖరీదైన రాళ్లతో నిర్మించారు. ప్యాలేస్ గోపురము చూడడానికి ఎంతో అందంగా తీర్చిదిద్దారు.
- లేక్ ప్యాలేస్ హోటల్ నిర్వహణ బాధ్యతలను 1971లో తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలేసెస్ తీసుకుంది. ఆ తర్వాత ఈ ప్యాలేస్ కు అదనంగా మరో 75 గదులు నిర్మించారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more