మండ్య నగరం కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రధానపట్టణం. ఇది మైసూరు నుంచి 40 కి.మీ. దూరంలోనూ, బెంగుళూరు నుంచి 100 కి.మీ.దూరంలోనూ వుంటుంది. నిజానికి ఈ నగరానికి మాండవ్య రుషి పేరుమీద మాండవ్యనగరంగా పేరొచ్చిందని విశ్వసిస్తుండగా.. విద్యావంతులు మాత్రం వాటిని ఖండిస్తున్నారు. పురాతన శిలాక్షరాలను అనుసరించి.. ఈ ప్రాంతం పురాతన కాలం నుంచి మానవ నివాసప్రాంతంగా వుంటూ వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ.. పురాణాల్లో మాత్రం ఈ ప్రాంతానికి మాండవ్య రుషి పేరు మీద పేరొచ్చిందని పేర్కొనబడింది.
స్థలపురాణం :
పూర్వకాలంలో మాండవ్య అనే మహర్షి ఉండేవారు. ఒక ముని కుమారుడు అయిన ఆయన... నిత్యం తపస్సు సాధనలో వుండేవారు. లోకకళ్యాణం కోసం తన జీవితాంతం తపస్సులోనే గడిపేశారు ఈయన! ఎందరో అప్సరసలు ఈయన తపమును భంగం కలిగించడానికి ప్రయత్నించినప్పటికీ.. చివరికి అలసిపోయి వాళ్లు వెనక్కు వెళ్లిపోయేవారు కానీ.. మహర్షి మాత్రం తపస్సాధనలో ఉండిపోయేవారు. అంతటి తపశ్శాలి అయిన ఈ మహర్షి నివసించిన ఓ ప్రాంతానికి ఈయన పేరు మీదే మాండవ్యనగరంగా పేరుగాంచింది. అయితే.. అది కాలక్రమంలో మండ్యగా మారింది.
ఈ మాండ్య నగరాన్ని చరిత్రలో ఎందరో రాజులు పరిపాలించారు. ఇక్కడ ఎన్నో దేవాలయాలు వెలిసి వున్నాయి. ప్రజలకు ఆకర్షించే ఎన్నో పర్యాటక ప్రాంతాలు వున్నాయి. ఈ నగరానికి సమీపంలోనే జలపాతాలు, ఆకర్షణీయమైన ప్రాంతాలు.. ఇంకా ఎన్నెన్నో వున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more