భారతదేశంలో కొలువై వున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కోదండ రామాలయం ఒకటి! ఇది ఎంతో ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో వుంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఇంకా చెప్పుకోదగ్గ ఎన్నో విశేషాలు ఈ ఆలయంలో సంతరించుకుని వున్నాయి.
స్థలపురాణం :
రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా వున్న సమయంలో విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. అలాంటి సందర్భమే ‘సీతారామ కల్యాణం’ జరిగాక కూడా ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి దుష్టశిక్షణ కోసం రాముణ్ణి ప్రార్థించగా.. ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారు. తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.
ఆలయ విశేషాలు :
1. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని విగ్రహాలు ఈ ఆలయంలో చెక్కబడ్డాయి. అంతేకాదు.. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం దేశంలో ఇదొక్కటే.
2. ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.
3. 16వ శతాబ్దంలో ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.
4. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
ఇమాంబేగ్ బావి కథనం :
1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ రాజుకు ప్రతినిథిగా ఇమాంబేగ్ చెలామణీ అయ్యాడు. ఒక సందర్భంలో ఇమాంబేగ్ ఈ ఆలయానికి వచ్చిన భక్తులను.. ‘మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా?’’ అని ప్రశ్నించాడు. అందుకు భక్తులు.. ‘‘చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు’’ అని సమాధానమిచ్చారు. దాంతో ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ‘ఓ’ అని సమాధానం వచ్చింది.
ఆ సమాధానం విన్న ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. వెంటనే స్వామి భక్తుడిగా మారిపోయాడు. అలా స్వామి భక్తుడిగా మారిపోయిన ఇమాంబేగ్... అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ‘ఇమాంబేగ్ బావి’గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, ఇక్కడి విశేషం.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more