మారుతున్న కాలం తో పాటు మనమూ మారుతూ వస్తోన్నా , ఇప్పటికీ , దైవారాధన , ఆనాధిగా పాటించే కొన్ని పద్ధతులు , వీటిల్లో మార్పు లేదు . మరి మన జీవితం లో వివిధ అంశాలలో , దశల్లో , మనం విజయాన్ని అన్వేషిస్తున్నాం , కాబట్టి మన అన్వేషణ ని కొనసాగిస్తూ , జీవితం లో విజయం సాధించడానికి మరికొన్ని మార్గాలు ;
గంధాన్ని వ్యాపారస్తులు ఉచితంగా పంచితే లేదా దానం చేస్తే వ్యాపారంలో లాభం ఎక్కువగా ఉంటుంది. గంధాన్ని దానంగా ఇవ్వడం ద్వారా వ్యాపార రీత్యా పురోభివృద్ధి చేకూరుతుంది. గంధాన్ని ఎవరైతే దానం చేస్తారో వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. గంధాన్ని సంస్కృతంలో చందనమని పిలుస్తారు. గంధాన్ని నుదుటికి పూసుకోవడం ద్వారా శ్రీ లక్ష్మి దేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. గంధాన్ని నుదుటికి పూసుకోవటం వలన దేహంలోని ఉష్ణాంశం తగ్గిపోతుంది.
రవ్వతో చేసిన గంజిని దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా లావుగా ఉండే వారు సన్నగా అవుతారట. రజస్వల సమస్యలు, వివాహం వాయిదా పడుతూ పోతుంటే ఆ జాతకులు దేవి ఆలయానికి వెళ్లి మంగళవారం రవ్వతో చేసిన గంజిని దేవతకు నైవేద్యం చేసి పంచాలి. కానీ దాన్ని వారు తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
హనుమంతుడికి మంగళవారం ఎంతో ప్రీతి , అయితే ఈ రోజు తో పాటు , హనుమంతుడిని గురువారం మల్లెపూలతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. గురువారం పూట శుచిగా హనుమాన్కు మల్లెపూల మాల సమర్పించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, మనోధైర్యం, సంతానప్రాప్తి, శుభకార్యాలు వంటివి చేకూరుతాయి. అలాగే తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
ఇంట్లో బల్లి శబ్ధం చేస్తుందా..? అప్పుడప్పుడు కిందపడి పరుగెడితుందా? గోడపై మీ కంట పడేటట్లు అటూ ఇటూ తచ్చాడుతుందా? అయితే ఈ కథనం చదవాల్సిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఇదేవిధంగా ఆగ్నేయంలో బల్లి శబ్ధం చేస్తే ఇంట్లో కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి ఏర్పడుతాయి. ఇక దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే కుజ గ్రహ ప్రభావంతో శుభకార్యాలు జరగడం, అదృష్టం కలిసివస్తుందని గ్రహించాలి. అదే మీ పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే ఊహించని ఖర్చులు, విచారకరమైన వార్త అందుతుంది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more