ఆంజనేయ స్వామిని ప్రార్ధిస్తే , భూతప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని అందరి నమ్మకం . అందుకే , ఏ సంఘటన వల్ల కాని , ప్రమాదం ఎదురైనప్పుడు కాని , అనుకోని అవాంతరం ఎదురైనప్పుడు కాని , 'ఆంజనీయ ' అంటూ మనం ఆ స్వామిని తలుచుకుంటాం , సమస్యను ఎదురుకునే శక్తిని ప్రసాదించమని కోరుకుంటాం , ధైర్యాన్ని మనకు ఇవ్వమని ప్రార్దిస్తాం . అందుకే , రామ భక్తుడైన ఆంజనేయ స్వామీ , దైవ స్వరూపంగా , శక్తికి , ధైర్యానికి ప్రతీకగా కొలవబడుతున్నాడు .
మరి ఇటువంటి దైవ స్వరూపం కొలువయ్యి ఉన్న ఆలయాలు , ప్రదేశాల ప్రాముఖ్యతలు చాలానే ఉన్నాయి . ఇటువంటి ఆలయాల్లో ప్రత్యేకమైనది , ప్రకాశం జిల్లా అడ్డంకి దగ్గర్లో ఉన్న శింగరకొండలో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం .
మరి ఈ ఆలయ విశిష్టతను అన్వేషించాలి అంటే , స్థల పురాణం గురించి తెలుసుకోవలసిందే ...
శింగరకొండపై లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న దశలో ఒక మహా యోగి ఆ గ్రామానికి విచ్చేసి, కొండ దిగువన చెరువు గట్టున ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెళ్ళాడు. అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడం కొండమీద ఆలయ పనిలో ఉన్నవారెందరో చూశారు. వాళ్ళు కొండ దిగి వచ్చి చూసేసరికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగిపోతూ కనిపించింది.
దాంతో ఆ గ్రామస్తులు, చుట్టుపక్కలవారు కలిసి, లక్ష్మీ నృసింహ దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు.
కేవలం భయం అనే రాక్షసి నుండి పీడింపబడటమే కాక , జీవితం లో విజయం సాధించెంతటి ధైర్యం సొంతం చేసుకోవాలన్నా కూడా , ఆంజనేయ స్వామీ ఆరాధనే శరణ్యం . మరి ఈ భగవత్స్వరూపం కొలువయ్యి ఉన్న ఒకానొక ఆలయాన్ని , ఆ ప్రదేశాన్ని ఇవాళ అన్వేషించాం .
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more