ప్రార్థించే పెదాల కన్నా.. సాయం చేసే చేతులే మిన్న అన్న సూక్తి అనుసరించి.. తన తాయత్తు కాదని తెలసినా.. సాయానికి తోడు లభిస్తున్నందన్న ఆశ, దానికి తోడుగా నిలచిన ఆశయం అతన్ని ముందుకు నడిపించాయి. అనాధలకు ఆర్తుడయ్యాలా నిలబెట్టాయి. అనాధ బాలబాలికలకు ఆయన తల్లి, తండ్రిగా నిలచేలా మలిచాయి. అనాధల పిల్లలకు విద్యా ప్రదాతగా, సమాజంలోని అనేక మంది స్ఫూర్తి ప్రదాతగా తీర్చిదిద్దాయి. కృషి వుంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు అన్న విధంగానే ఆయనను మహోత్తముడిగా, ఆదర్శవంతుడిగా నిలబెట్టాయి. తన ఆశయానికి అర్థాంగి సాయంతో, కన్నబిడ్డలు కూడా సహకరించడంతో పరిఫూర్ణవంతుడిగా నిలిచాడు ఆయన. ఆయనే పూర్ణచందర్ రావు.
సామాన్య రైతు కూలి కుటంబంలో జన్మించిన పూర్ణ చంద్రర్ రావు చిన్న నాటి నుంచే తన రూటు సపరేటు అంటూ పెరిగారు. సమాజం మనకేం చేసిందని కాకుండా సమాజానికి మనం ఏం చేశామని ప్రశ్నించుకుంటూనే పెద్దవారయ్యారు. సమాజంలోని పేదలకు ఉచితంగా విద్యను అందించాలని, విద్యార్థి ధశలోనే ఫిజు రియంబర్స్ మెంటు కోసం పోరాడి సఫలీకృతుడయ్యారు. 1986-87 సంవత్సరంలో ప్రకాశం జిల్లాను కరుపు ప్రభావిత జిల్లాగా ప్రకటించింది కేంద్రం. ఈ నేపథ్యంలో తాను చదువుతున్న చేరాల వీఆర్ఎస్ కాలేజ్ లోని పేద విద్యార్థులందరి తరపున నాయకత్వం వహించి జిల్లా కలక్టరు కార్యాలయాని పదేపదే చక్కర్లు కొట్టి ఎట్టకేలకు ఫిజు రియంబర్స్ మెంట్ సాధించారు. ఈ విజయమే తనను సమాజాన్ని మరో కోణంలో చూసేందుకు దోహదపడింది. కన్న తల్లిదండ్రుల కోసం, కుటుంబ అవసరాల కోసం కొన్ని సంవత్సరాల పాటు ప్రైవేటు పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగం చేసినా.. తాను తన ఆశయాల నుంచి పక్కకు తప్పుకుంటున్నట్ల భావించాడు. అఫీసుల్లో బాసుల మొప్పు పొందేందుకు పలువురు చేసే హేయకరమైన చర్యలను అసహించుకుంటూ.. తనకు సమాజాన్ని బాగు చేసే పనిలో నిమగ్నమయ్యాడు.
ఆశయ సాథనకు తొలి మెట్టు..
గుంటూరు జిల్లా నాదేండ్ల మండలంలోని కనపర్తి పంచాయితీ పరిధిలోగల మైనంపాడు గ్రామంలోని తనకున్న కొద్ది పాటు భూమిని విక్రయించి, అక్షరాల 60 వేల రూపాయల చేతుల్లో పట్టుకుని తన ఆశయం కోసం ముందుకు కదిలాడు. చిన్నగా ఓ ఇంటని నిర్మించడంతొ తన ఆశాయానికి బీజం పడినట్లు అయ్యింది. తన ఆశయానికి గ్రామంలోని కొందరు తన మిత్రులు ఉడతా భక్తిగా సాయం చేశారు. అంతే తన ఆశయం సాక్ష్యాత్కారం అయ్యింది. అదే ‘నీడి ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఎడ్యూకేషన్’. అవసరమున్న నిరక్ష్యరాస బాలబాలికలకు విద్యనందించే కార్యక్రమం. షార్టుగా నైస్ 2003లో స్థాపించిన ఈ స్వచ్ఛంద సంస్థతో ఆనాధ బాలబాలికలకు శరణాన్ని కల్పిస్తూ.. వారికి ఉచితంగా విద్యాబోదన కల్పిసున్నారు. అనాధ పిల్లలైనా.. శరణాలయంలోనే విద్యా బోధన చేసినా.. వారిలో పాఠశాలకు వెళ్లమన్న భావన కలగడం కోసం.. సమాజంలోని మిగతా బాలబాలికల మాదరిగానే యూనిఫాం, షూస్, సాక్స్, బుక్స్, ఇలా అన్నింటిలోనూ వారు మిగతా పాఠశాల విద్యార్థులతో పోటీ పడేలా తీర్చిదిద్దారు పూర్ణచందర్ రావు. పది మందితో 2003లో ప్రారంభమైన నైస్ ప్రస్తుతం 200 మంది అనాధ బాలబాలికలతో బాసిల్లుతోంది.
నైస్ ద్వారా ఎన్ఐఓఎస్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గుర్తింపు పొందన విద్యావ్యవస్థ ద్వారా అనాదా బాలబాలికలను చదవిస్తున్నారు. వారు ఉన్నత విద్యను అభ్యసించి.. దేశంలోని ఎక్కడికి వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే పూర్ణచందర్ రావు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్ణ ఆశయాల సాథనలో నైస్ విద్యార్థులు కూడా అందరికందూ ఫస్ట్ క్లాస్ లోనే ఉత్తీర్ణతను సాధిస్తూ మిగిలిన పాఠశాల విద్యార్థులకు పోటీగా నిలిచారు. అనాధ బాలబాలికల విద్యను అందించడంతో పాటు 2003లో ఒక ఉపాధ్యాయుడి సహా మరో నాన్ టీచింగ్ స్టాప్ కు ఉపాది కల్పించిన పూర్ణగారు.. క్రమంగా ఇప్పడు 16 మంది ఉపాధ్యాయులతో పాటు 9 మంది నాన్ టీచింగ్ స్టాప్ కు ఉపాధి కల్పించారు. ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ స్టాప్ కు నెలనెలా వేతనాలను అందిస్తున్నా.. తాను మాత్రం ఈ పన్నెండేళ్ల ప్రయాణంలో వేతనాన్ని తీసుకోలేదు. కాగా, గత ఏడాది డిసెంబర్ మాసంలో తొలి జీతాన్ని అందుకున్నానని, అదీనూ నామమాత్రంగానే తీసుకున్నానని పేర్కోన్నారు పూర్ణచందర్ రావు.
విధి వంచించి వారు అనాధ బాలబాలికలుగా మారినా.. ఆ అభాగ్యుల బాల్యం నరకప్రాయం కాకూడదని, సమాజంలోని మిగతా పిల్లల మాదిరిగానే వారు విద్యాబద్దులు అలవర్చుకోవాలన్న.. వారికి నాలుగు గోడల మధ్య ఆశ్రయం కల్పించాలని, వీధుల్లోని రోడ్లు, బస్టాండ్లలలో వారు శరణాన్ని తీసుకోవద్దని ధృడసంకల్సంతో ఏర్పాటైనదే నైస్ స్వచ్ఛంగ సంస్థ. అనాధలు.. అందులోనూ ఎవరికీ తీసిపోని విధంగా విహారయాత్రలు మొదలుకుని అన్ని పాఠశాల వాతవరణంలో కల్పించాలి. అంటే ధనం ఏ యేడుకాయేడు పెరుగుతూనే వుంది. వారికి ఆదాయ వ్యయాల విషయాలను తెలియనీకుండా కేవలం పూర్ణచంద్రర్ రావు తన ట్రస్టు బోర్డు సభ్యులతో చర్చించి సమకూర్చుతారు. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా తనకు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తని అమ్మి ప్రారంభించిన ట్రస్టు.. దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూనే వున్నా.. దానిని నడిపించేందుక పూర్ణచందర్ రావు పడుతున్న కష్టాలు కూడా అనన్యసామాన్యమైనవే. అహర్నిశలు ఆయన ద్యాస, శ్వాస నైస్ ట్రస్టు పైనే.
ముందుకు కదిలివచ్చిన దాతలు.. పలువురి పరీక్షలు..
తన ఆశయాన్ని ఎలాగైనా కొనసాగించాలన్న దృక్పథంతో ముందుకు సాగుతున్న పూర్ణచందర్ రావు పలువురు దాతలను సాయం అర్థించారు. ఆశా ఫర్ ఎడ్యూకేషన్ అనే సంస్థ ద్వరా తొలినాళ్లలో తన మిత్రులు, సన్నిహతుల సాయంతో నడిచినా క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరగడం, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ సంఖ్య కూడా పెరగడం, విద్యార్థుల సాధారణ అవసరాల వ్యయం కూడా అంతకంతకూ పెరగడంతో దాతల కోసం అహర్నిషలు తిరగారు పూర్ణచందర్ రావు. ఆయనలోని దీక్షాదక్షతలను, కృషి పట్టుదలను చూసిన పలువురు ముందుకు రావడం, పలు సంస్థలు ముందుకు రావడం, విదేశాల్లోని దాదలను సిఫార్సు చేయడం వారు ట్రస్ట చేస్తున్న పనులను అభినందిస్తూ తమ శక్తి మేరకు సాయం చేయడంతో 200 మంది అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించి విద్యాబుద్దలు అందిస్తుంది ట్రస్టు. అంతేకాదు తమ ట్రస్టుకు సాయం చేసిన వారందరికీ ఆ ఏడాది ట్రస్టు తరపున తన ఆదాయవ్యయాల పట్టికను కూడా పంపిస్తుంటారు పూర్ణ చందర్ రావు. దాతగా మీరు పది రూపాయలు ఇచ్చినా ఆదాయపట్టికలో మీ పేరు తప్పకుండా వుంటుంది. అదినూ మార్చ్ తో ముగిసే ఆర్థిక సంవత్సరం తాలుకూ పట్టికను ఏప్రిల్ నెల మొదటి పక్షంలోనే పంపుతామని చెబుతున్నారు. దాతలు వారి తోచినంత ఇస్తుంటారు. ఇవ్వడం ముఖ్యం.. తాను చెప్పే దాంట్లో నిజముందని ఆ తరువాత సంవత్సరం వారు తెలసుకుని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారే మరింత దానం ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు పూర్ణచందర్ రావు. కొందరు తనను మొదట్లో పరీక్షించి.. ఆ తరువాత స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలు కూడా అనేక మంది వున్నారన్నారు.
రాజకీయ జోక్యానికి, ప్రభుత్వ మద్దతుకు దూరంగా...
తన ట్రస్టులో రాజకీయ జోక్యం, ప్రమేయం అసలు వుండకూడదని భావించిన పూర్ణచందర్ రావు.. వారి దరికి వెళ్లనూ లేదు. తన అనాధ శరణాలయంలో బోజనం కోసమే.. లేక విద్యాబోధనో నచ్చి రాజకీయ నాయకులు ప్రమేయంతో ఎవరైనా వస్తారని ఆయన అసలు రాజకీయ నాయకుల చెంతకు కూడా వెళ్లలేదు. వారిని ఎలాంటి సాయం కావాలని ఆర్జించనూ లేదు. తన సంస్థలో నూతన గదుల నిర్మాణం, నూతన ఫర్నచర్ ప్రారంబోత్సవాలకు తన సంస్థకు ఇతోధికంగా విరాళాలు అందించిన దాతలను మాత్రమే ఆహ్వానించి వారి చేతుల మీదుగానే అన్ని చేపడుతుంటారు. అందుకే ఇప్పటికీ పన్నేండేళ్లు కావస్తున్న ప్రభుత్వ సాయం కోసం, విదేశాల నుంచి వచ్చే విరాళాల కోసం ఆయన ఆశించనూ లేదు. తన గురించి తానే చెప్పుకుని కష్టపడి నిధులను సమకూర్చుకుంటారే తప్ప ప్రభుత్వ జోక్యంతో ఒక్క రూపాయి వచ్చినా అయన అంగీకరించరు. తన ట్రస్టులో కేవలం అనాధలకు మాత్రమే చోటు కల్పించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులు లేని వారికి అధిక ప్రాధాన్యత, ఆ తరువాత తల్లి లేని వారికి, ఆ పిమ్మట తండ్రిలేని వారికి ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ఎవరి పడితే వారు వచ్చి అనాధ అంటూ ఈ ట్రస్టులో చేరేందుకు వీలు లేదు. అనాధులుగా వారు రూడీ చేసుకున్న తరువాత కూడా ట్రస్టు తరపున మళ్లీ ఒకరు వెళ్లి వారు నిజంగా అనాధలా.. కాదా అన్నవిషయాన్ని నిజనిర్థారణ చేసుకుంటారు. ఆ తరువాతే ఆ విద్యాలయంలో చోటు లభిస్తుంది. అనాధలే అయినా.. వారి సంబంధికులు ఎక్కడ వున్నారు. వారికి స్థిర చరాస్థులు వున్నాయా అన్ని విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాతే తమ నిబంధనలకు అనుగూనంగానే ఎవరూ లేని, వారిని మాత్రమే వారు చేరదీసి విద్యాబోధన కల్పిస్తుంటారు.
కుటుంబ నేపథ్యం.. పిల్లలకు ఉచితంగానే విద్య...
కన్నబిడ్డలకు, సహధర్మచారిణిల కోసం కడుపు కట్టుకుని, జిహ్వను అదుపులో పెట్టుకుని ఆస్తులను కూడ బెట్టిన వాళ్లను చూశాం. కానీ తాను ఇంటి వాడు కావాలన్న అలోచనలోనే ఆశయం ఇమిడివుంది. అందరిలా తాను అందరూ వున్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే వారికి ప్రత్యేకంగా కుటుంబాన్ని, తన అనే వారిని అందించడంలో లాభం ఏముందనుకున్నాడో.. ఏమో తెలియదు కానీ.. అనాధలకు అది అందిస్తే.. వారికి సర్వస్వం కల్పించిన వారని అవుతామనుకున్నాడు. తన అలోచన మేరకు ముందుకు సాగడంతో.. ఇవాళ తన ఆర్థాంగి తనలోనే కాదు, తన బాద్యతలలో, ఆశయాల సాధనలోనూ అరభాగం పంచుకుంది. అందుకే కన్న బిడ్డలకు తరగిపోని, చోరులు చౌర్యం చేయలేని సంపదను అందించాడు. తన ప్రతి అడుగులోనూ సహకరిస్తూ, వెన్నుదన్నుగా నిలిచింది ఆ ఇంటి ఇల్లాలు. కుటుంబ యజమానిగా ఆయన ఆశయం కోసం అహర్నిషలు కష్టపడుతుండగా, ఆమె సంపాదనే ఆ ఇంటి ఖర్చులను వెల్లదీస్తోంది. ఆమె పేరులోని జయమే వారిని మున్ముందుకు నడిపిస్తోంది. అమె పేరే జయలక్ష్మీ. వారి ఇద్దరు మగ బిడ్డలు సంతానం. పెద్దబ్బాయి మావోశ్రీ ఐఎంఏ కోర్సును అభ్యసిస్తుండగా, రెండో అబ్బాయి ఓంశ్రీ పదవ తరగతి చదువుతున్నాడు. పూర్ణచందర్ రావు గారి ఆశయం గురించి తెలుసుకున్న సిల్వర్ ఓక్స్ విద్యాసంస్థ వారి ఇద్దరi అబ్బాయిలకు ఉచితంగా విద్యాను అభ్యసించేందుకు అవకాశాన్ని కల్పించి ఉడతా భక్తిని చాటుకుంది.
ఉదారతను చాటుకున్న దాతలు..
అనాధలకు తన ట్రస్టు ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిగ్గాలన్న తన ఆశయానికి అండగా చాలా మంది నిలిచారు. తాము స్వయంగా మంచి చేయాలని యోచించినా సమయాన్ని వేచ్చించలేక, లేదా తన దినసరి కార్యక్రమాలలో బిజీగా వుంటూ వాటిప ద్యాసను నిలుపలేమని భావించిన ప్రతీ ఒక్క మహనీయుడు పూర్ణ చందర్ రావుకు అండగా నిలిచారు. నిలుస్తున్నారు. ఇకపై నిలుస్తారు కూడా. అలాంటి వారిలో అగ్రగన్యులు కూడా అనేకం. నాట్ కో ఫార్మ, నన్నపనేని గారు, న్యూఢిల్లీ మైక్రోసాప్ట్, అమెరికాలోని మెక్రోసాప్ట్, యువర్ ఇన్నర్ సోల్, తానా ఫౌండేషన్, నెట్ ఎన్ రిచ్ టెక్నాలజీస్, ఎం వీ కృష్ణారెడ్డి తదితరులు ముందు వరసలో వున్నారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే తమ ట్రస్టు ఆద్వర్యంలో నడుస్తున్న పాఠశాలకు ఈ ఏడాది సీబీఎస్ఈ గుర్తింపు కూడా లభించిందని పూర్ణ చందర్ రావు గర్వంగా చెబుతున్నారు. దాతలు ఇదే విధంగా స్పందిస్తే మరెందరో అనాధలకు తాము వెలుతురై, ఉత్తమ మార్గనిర్ధేశకం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దాతలూ స్పందించండీ ప్లీజ్..
నైస్ ట్రస్టు కోసం దాతలు ముందుకు కదలాలని తమకు తోచినంత అనాధ బాలబాలికల విద్యాకు ప్రోత్సాహాన్ని కల్పించాలని పూర్ణ చందర్ రావు కోరుతున్నారు. ప్రతీ ఒక్కరికి తాము సమాజానికి ఏంతో కొంత మంచి చేయాలని వుంటుందని, అయితే బిజీ బిజీ వ్యవహరాల్లో వారికి సమయం లభించక మంచి చేసేందుకు అలోచన వున్నా సమయం వుండదన్నారు. ఈ నేపథ్యంలో తమ ట్రస్టు చేస్తున్న సమాజహితాన్ని వీక్షించి అనాధ బాలికల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న నైస్ కు విరాళాలను పంపాలని కోరుతున్నారు. విరాళంగా దాతలు అందించే ప్రతీ రూపాయి అనాధల కోసం వెచ్చించి దానిని దాతల జాబితాలో పోందుపరుస్తుంటామన్నారు. ఒక్క విద్యార్థికి ఏడాది పాటు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చే దాతలు 12 వేల 500 రూపాయలను అందించాలని, అలా కాకుండా ఒక్క రోజు అనాధలకు అన్నదానం చేసేందుకు పూనుకునే దాతలు 5 వేల రూపాయలను, ఒక్క విద్యార్థికి ఏడాది పాటు భోజన ఖర్చులు భరించాలనుకునే వారు ఆరు వేల ఎనమిది వందల రూపాయలను, ఒక్క ఏడాదికి విద్యార్థుల చదవు ఖర్చు, పుస్తకాలు, యూనిఫాం భరించాలనుకున వారు రూ. 4 వేల 500, ఒక్క విద్యార్థి దుస్తులు, సబ్బులు, ఇత్యాదుల అందించాలనుకునే దాతలు 1200 రూపాయలను అందించాలని కోరుతున్నారు. ముందుకు వచ్చే దాతలు Needy Illiterate Children Education పేరున చెక్కుల రూపంలో NICE C/o P.Purnachander Rao, plot no; 60, sathavahana HmT colony, Kukatpally, Hyderabad-72 చిరునామాకు పంపవచ్చు. నైస్ ట్రస్టు వెబ్ సైట్ కోసం nice-india-org కి లాగ్ అన్ కండి.. పూర్ణచందర్ రావుతో మాట్లాడి విరాళాన్ని స్వయంగా అందజేయాలనుకునే వారు 98482 35103 నెంబరు కాల్ చేయవచ్చు. నైస్ ట్రస్టుపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే nice_hyd@yahoo.com కి ఈ మెయిల్ చేయవచ్చు.
{besps}NGO{/besps}
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more