గులేబకావళి' కథ (1962) లోని 'నన్నుదోచుకుందువటే' పాటనుండి 'అరుంధతి' లో 'జేజమ్మ' పాటవరకు ఆయనప్రస్థానం సాగింది. ఇంతకాలం తెలుగులో గేయరచయితగా సాగించిన ఆయన మరెవరోకాదు సి. నారాయణరెడ్డి. నారాయణరెడ్డిగారు సినారే పేరుతో పాటలురాసేవారు. 1962 లో 'ఆత్మబందువు' మొదటిచిత్రం చేసినఆయన 50 వసంతాలు పూర్తిచేసుకున్నారు. ఆయన తెలుగు భాషలో 3000 పైగా పాటలు రాసారు. ఆయన కీర్తిశేషులు నందమూరితారకరామారావుగారికి మంచిస్న్హేహితుడు. అలాగే నారాయణరెడ్డిగారు మల్లెమాలసుందరరామిరెడ్డిగారితో కూడా చాలా దగ్గరిస్నేహం ఉంది. జూలై 29 1931 లో కరీంనగర్జిల్లాలో సింగిరెడ్డినారాయణరెడ్డిగా జన్మించిన ఆయన తెలుగుభాషపై ఎంతో మక్కువ పెంచుకున్నారు. 1997 లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన 1992 లో పద్మభూషణ్ అందుకున్నారు. అలగే విశ్వంభర పుస్తకం రాసినందుకుగాను జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు. ఆయన మూడుతరాలకు సాహిత్యం అందించారు.
తెలుగుపాటకు ఒరవడి దిద్దిన సినారె వందల సినిమా పాటలను రాశారు. భారతప్రభుత్వం బహుకరించే ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఉన్నతచదువులు చదివిన సినారె ఉస్మానియాయూ నివర్శిటీలో అధ్యాపకునిగా పనిచేశారు. తెలుగు రచనలో అన్నివిభాగాల్లోనూ ఆయన రచనలు సాగించారు. విశ్వనాథ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ్ అవార్డు సినారెకు దక్కింది. సినారె 1962 సంవత్సరంలో సినిమా రంగంలో కిప్రవేశించారు. గులేభకావళికథ సినిమాకోసం ఆయనరాసిన 'నన్నుదోచుకుందువటేవన్నెలదొరసాని' ఎంతో సూపర్హిట్ అయింది. ఇక అప్నటి నుంచి ఎన్నోహిట్సినిమాలకు ఎన్నోసూపర్హిట్పాటలు రాసారు.
సమయానికిరావడం, తానుచెప్పాలనుకున్నవిషయాలుసూటిగాచెప్పటం, సమయానికి విలువనివ్వడంలో సినారెదిట్ట... నేటికి, తెలుగుదనాన్నిప్రతిమ్బిమ్బించేలా ఉంటుంది సినారె వస్త్రాదరణ.
సమాజంలోఎటువంటి అభిప్రాయబేధాలు తలెత్తినా, సినారె ఏం అంటారో, ఆయన భావన వినడానికి ఎదురు చూసేవారు ఎందరో... 'నా కాలానికి ప్రాణం ఉన్నంతవరకు రాస్తాను, రాస్తూనేపోతాను', అనేన్తటి ధైర్యం, రచనపై ప్రేమ కలిగిన వ్యక్తీ సినారె... అందుకే, డాక్టరేట్ నుండి పద్మభూషణ్ వరకు సినారె అందుకొని ప్రశంస లేదు...
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more