కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. తన సోంత నియోజకవర్గంలోని ప్రజల వద్దకు చేరుకున్న ఆయన.. అక్కడి ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. నియోజకవర్గ ప్రజల ప్రేమను మించిన పదవులు, అధికారం ఏదీ లేదంటూ వైరాగ్యాన్ని ప్రదర్శించారు. దీంతో రాజకీయ పరిశీలకులు మాత్రం రాష్ట్రంలో మరోమారు ముఖ్యమంత్రి మార్పు తప్పదా?.. అంటూ రాజకీయ వేడిని రాజేశారు. అదేమంటే ఈ ప్రశ్నకు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై వ్యాఖ్యలు ఔననే ఊహాగానాలకు తెలరలేపుతున్నాయని అంటున్నారు.
ముఖ్యమంత్రి బొమ్మై తన సొంత నియోజకవర్గమైన షిగ్గాన్లో కిట్టూర్ రాణి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీఎం హోదాలో వచ్చిన తమ నియోజకవర్గ ఎమ్మెల్యేను చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడి పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదవులు సహా ఈ సృష్టిలో మనకు ఏదీ శాశ్వతం కాదని అన్నారు. మనం ఇలా ఎంతకాలం ఉంటామో ఎవరికీ తెలియదని, ఈ పదవులు, అధికారాలు కూడా శాశ్వతం కాదని అన్నారు. ఈ విషయాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకునే నడుచుకుంటానని చెప్పి సీఎం మార్పుపై సంకేతాలిచ్చారు.
నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ బసవరాజ్ను మాత్రమేనని, ముఖ్యమంత్రిని కాదని అన్నారు. గతంలో హోంశాఖ మంత్రిగా, సాగునీటి మంత్రిగా పనిచేశానని పేర్కొన్న సీఎం.. తాను ఎప్పుడు ఇక్కడకు వచ్చినా బసవరాజ్ను మాత్రమేనని, పదవుల కంటే బసవరాజ్ మాత్రమే శాశ్వతంగా ఉంటాడని భావోద్వేగంగా చెప్పారు. గొప్ప విషయాలు చెప్పడానికి ఏమీ లేవని, మీరు ఆశించినట్టుగా తాను బతికితే చాలని, మీ ప్రేమ, నమ్మకం కంటే గొప్పదైన అధికారం ఏదీ లేదని తాను భావిస్తానని చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సీఎం మార్పు తప్పదన్న సంకేతాలకు నిదర్శనమని పలువురు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more
May 19 | సీనియర్ కమేడియన్ అలీ అధికార వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీలో సినీమారంగం నుంచి ఆశించినంత స్థాయిలో మద్దతు లేదు. జగన్ సర్కార్ అధికారంలోకి... Read more
May 18 | గుజరాత్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదార్ ఉద్యమ నేత హర్థిక్ పటేల్.. సరిగ్గా ఎన్నికలకు ముందు తన మనసు మార్చుకున్నారు. 24 గంటల ముందు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించిన తరువాత... Read more
Mar 18 | కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్గా చెప్పుకొనే కోమటిరెడ్డి బ్రదర్స్.. కాషాయ బాట పట్టనున్నారా?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో భేటీ... Read more
Mar 18 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. మరీ ముఖ్యంగా పంజాబ్లో అధికారాన్ని తిరిగి అందుకుంటామన్న అంచనాలు నెలకొనగా, తాజా పలితాలతో అక్కడి కూడా పరిస్థితి అద్వానంగా... Read more