బెజవాడ వైసీపీలో విజయవాడ సెంట్రల్ సీటుపై ఎంతోకాలంగా ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్న తనకు కాకుండా సమన్వయకర్త బాధ్యతలను మరోకరికి అప్పగించడంతో అసమ్మతి సెగ రగలిపోతున్న వంగవీటి రాధ.. వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం వున్నందున తనకు పార్టీ అధిష్టానం న్యాయం చేస్తుందా.? లేదా.? లేని పక్షంలో జనసేనలోకి వెళ్లి అదృష్టాన్ని పరిక్షించుకోవాలని కూడా ఆయన యోచిస్తున్నారన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి.
జనసేనలో చేరితే తమకు కలసి వస్తుందని, ఆ పార్టీ నుంచి సెంట్రల్ సీటు కూడా హామీ లభిస్తుందని కొందరు రాధా అనుచరులు ఆయనకు సూచిస్తున్నాట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా వైసీపీ పార్టీ కోసం కష్టపడుతున్నాం.. ఈ పార్టీ అధిష్టానం తమకు ఎలా న్యాయం చేస్తుందో కూడా వేచిచూద్దమని మరికోందరు అనుచరులు.. వంగవీటి రంగా, రాధా మిత్రమండలి సభ్యులు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో.. మరికోంత కాలం వేచిచూసి అప్పుడు నిర్ణయం తీసుకుందామని వంగవీటి రాధా వారితో చెప్పినట్లు తెలుస్తుంది.
అయితే వేచిచూత ధోరణిని అవలంభిస్తున్న వంగవీటి రాధాకు జనసేన కూడా షాక్ ఇచ్చిందని సమాచారం. అదెలా అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ సమాయత్తం అవుతున్నారని, ఆయనను పార్టీలోకి అహ్వానించేందుకు కూడా జనసేన వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం. వామపక్ష పార్టీలతో సన్నిహితంగా ఉండే ఆయనకు అదే వామపక్ష పార్టీలతో కలసి బరిలో దిగనున్న జనసేన పార్టీ సెంట్రల్ సీటు ఇచ్చి ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీలో బోండా ఉమా, వైసీపీ నుంచి మల్లాది విష్ణు, బీజేపీ నుంచి ఐ.వి.ఆర్. క్రిష్ణారావు పోటీ చేస్తే జనసేన పార్టీ నుంచి వారికి దీటుగా నిలిచి ఎదుర్కొగల సత్తావున్న గెలుపుగుర్రాన్ని బరిలో నిలపాలని జనసేన యోచిస్తుందని సమాచారం. ప్రజాక్షేత్రంలో మంచివాడు అన్న పేరుతో పాటు.. ప్రత్యర్థులకు ధీటుగా అంగబలం, అర్థ బలం వున్న నేతను దించాలని.. దీనికి తోడు పవన్ కల్యాణ్ అభిమానుల బలం కూడా అదనంగా చేకూరుతుందని జనసేన స్థానిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఆపదలో ఉండి సహాయం అని అడిగి వచ్చినవారికి కాదనకుండా విద్య, వైద్యం, పేదరికం, కూడు, గుడ్డ, కళాకారులు, పెళ్లిళ్లు, దేవాలయాలు, సంబరాలు, ఫంక్షన్లు, విపత్తులు వచ్చిన సమయంలో మనిషిని ఆప్యాయంగా పలకరించి తన సొంత బంధువులా అంతకంటే తన ఇంటిలో మనిషిలా, తమవాడిగా నేనున్నాను అంటూ అండగా కోగంటి సత్యనారాయణకు విజయవాడలో మంచి పేరుంది. రాజకీయాలకు దూరంగా వున్నా.. ఆయన ప్రజల మనిషేనన్న గుర్తింపు వుంది. అందుకే జనసేన పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఒకవైపు పార్టీ నాయకులు, మరోవైపు కోగంటి అభిమానులు ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే వేచిచూసే ధోరణి అవలంభిస్తున్న వంగవీటికి షాక్ తగిలినట్టే.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more