janasena gives shock to vangaveeti radha.? వేచిచూస్తున్న వంగవీటి రాధాకు జనసేన షాక్.?

Janasena gives shock to wait and see vangaveeti radhakrishna

janasena shock Vangaveeti Radha, vangaveeti radha janasena, vangaveeti radha pawan kalyan, jana sena koganti satyam, vijayawada central koganti satyam, vangaveeti radha koganti satyam, vangaveeti radha, Vijayawada Central. YSR Congress, TDP, JanaSena, Pawan Kalyan, Chandrababu, YS Jagan Mohan Reddy, Andhra pradesh, Politics

Vangaveeti Radhakrishna, who is aspiting vijayawada central seat, gets shock from JanaSena. According to his close sources he is to join jana sena, but jana sena is assuring the same seat to businessman koganti satyam.

వేచిచూస్తున్న వంగవీటి రాధాకు జనసేన షాక్.?

Posted: 09/22/2018 02:59 PM IST
Janasena gives shock to wait and see vangaveeti radhakrishna

బెజవాడ వైసీపీలో విజయవాడ సెంట్రల్ సీటుపై ఎంతోకాలంగా ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్న తనకు కాకుండా సమన్వయకర్త బాధ్యతలను మరోకరికి అప్పగించడంతో అసమ్మతి సెగ రగలిపోతున్న వంగవీటి రాధ.. వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం వున్నందున తనకు పార్టీ అధిష్టానం న్యాయం చేస్తుందా.? లేదా.? లేని పక్షంలో జనసేనలోకి వెళ్లి అదృష్టాన్ని పరిక్షించుకోవాలని కూడా ఆయన యోచిస్తున్నారన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి.

జనసేనలో చేరితే తమకు కలసి వస్తుందని, ఆ పార్టీ నుంచి సెంట్రల్ సీటు కూడా హామీ లభిస్తుందని కొందరు రాధా అనుచరులు ఆయనకు సూచిస్తున్నాట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా వైసీపీ పార్టీ కోసం కష్టపడుతున్నాం.. ఈ పార్టీ అధిష్టానం తమకు ఎలా న్యాయం చేస్తుందో కూడా వేచిచూద్దమని మరికోందరు అనుచరులు.. వంగవీటి రంగా, రాధా మిత్రమండలి సభ్యులు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో.. మరికోంత కాలం వేచిచూసి అప్పుడు నిర్ణయం తీసుకుందామని వంగవీటి రాధా వారితో చెప్పినట్లు తెలుస్తుంది.

అయితే వేచిచూత ధోరణిని అవలంభిస్తున్న వంగవీటి రాధాకు జనసేన కూడా షాక్ ఇచ్చిందని సమాచారం. అదెలా అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ సమాయత్తం అవుతున్నారని, ఆయనను పార్టీలోకి అహ్వానించేందుకు కూడా జనసేన వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం. వామపక్ష పార్టీలతో సన్నిహితంగా ఉండే ఆయనకు అదే వామపక్ష పార్టీలతో కలసి బరిలో దిగనున్న జనసేన పార్టీ సెంట్రల్ సీటు ఇచ్చి ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ‌లో బోండా ఉమా, వైసీపీ నుంచి మల్లాది విష్ణు, బీజేపీ నుంచి ఐ.వి.ఆర్. క్రిష్ణారావు పోటీ చేస్తే జనసేన పార్టీ నుంచి వారికి దీటుగా నిలిచి ఎదుర్కొగల సత్తావున్న గెలుపుగుర్రాన్ని బరిలో నిలపాలని జనసేన యోచిస్తుందని సమాచారం. ప్రజాక్షేత్రంలో మంచివాడు అన్న పేరుతో పాటు.. ప్రత్యర్థులకు ధీటుగా అంగబలం, అర్థ బలం వున్న నేతను దించాలని.. దీనికి తోడు పవన్ కల్యాణ్ అభిమానుల బలం కూడా అదనంగా చేకూరుతుందని జనసేన స్థానిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఆపదలో ఉండి సహాయం అని అడిగి వచ్చినవారికి కాదనకుండా విద్య, వైద్యం, పేదరికం, కూడు, గుడ్డ, కళాకారులు, పెళ్లిళ్లు, దేవాలయాలు, సంబరాలు, ఫంక్షన్లు, విపత్తులు వచ్చిన సమయంలో మనిషిని ఆప్యాయంగా పలకరించి తన సొంత బంధువులా అంతకంటే తన ఇంటిలో మనిషిలా, తమవాడిగా నేనున్నాను అంటూ అండగా కోగంటి సత్యనారాయణకు విజయవాడలో మంచి పేరుంది. రాజకీయాలకు దూరంగా వున్నా.. ఆయన ప్రజల మనిషేనన్న గుర్తింపు వుంది. అందుకే జనసేన పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఒకవైపు పార్టీ నాయకులు, మరోవైపు కోగంటి అభిమానులు ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే వేచిచూసే ధోరణి అవలంభిస్తున్న వంగవీటికి షాక్ తగిలినట్టే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vangaveeti Radha  Vijayawada Central. koganti satyam  YCP  Jana Sena  Andhra pradesh  Politics  

Other Articles