సినీ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యురాలు రమ్య తన గాడ్ ఫాదర్ తో కలసి పయనించాలని భావిస్తుందన్న వార్తలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో బీజేపితో పాటు ఆర్ఎస్ఎస్ లను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలను సంధించి వివాదాస్పద నేతగా మారిన రమ్యను బీజేపి అధిష్టానం స్వాగతిస్తుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రమ్యకు రాజకీయాలలో గాడ్ఫాదర్ గా వున్న కర్ణాటక మాజీ సీఎం, మాజీ కేంద్రమంత్రి ఎస్ఎం కృష్ణ ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో రమ్య తోపాటు మరికొందరు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని వార్తలు రావడం బీజేపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను నిద్రకు దూరం చేసింది. అమెను బీజేపిలోకి అహ్వానిస్తే.. తాము ఆత్మహత్యలు చేసుకుంటామని ఏకంగా బీజేపి, ఆర్ఎస్ఎస్ దిగువ శ్రేణి నేతలు అధిష్టానానికి తేల్చిచెబుతున్నారు. ఎస్ఎం క్రిష్ణకు స్వాగతం పలికిన నేతలు.. రమ్యను అడ్డుకునేందుకు అనేక కారణాలే వున్నాయి.
కాంగ్రెస్ పార్టీ తరపున 2009 ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన రమ్య.. కార్ణటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గోంటున్నారు. అయితే అమె కూడా ఎస్ఎం క్రిష్ణతో కలసి బీజేపీ తీర్థం తీసుకోవాల్సి వున్నా.. అమెను చేరికపై అదిష్టానం కొంత వెనక్కు తగ్గింది. కార్యకర్తల నుంచి అమెను చేర్చుకోవద్దని పెద్దస్తాయిలో ఒత్తిడి రావడవంతో అధిష్టానం అమె చేరికపై ఇంకా పచ్చజెండాను ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో నిత్యం చురుకుగా వుంటూ బీజేపి, అర్ఎస్ఎస్ లపై పదునైన విమర్శలను చేసే రమ్య కూడా గత కొంతకాలంగా మౌనముద్రలోకి వెళ్లిపోయారు.
రమ్య గతంలో బీజేపిని టార్గెట్ చేస్తూ చేసిన పలు వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పందంగా మారాయి. అందరూ ఊహించినట్లు పాకిస్థాన్ పై ఉగ్రప్రభావం లేదని అది ఎంతో అందమైన దేశమని అమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని కూడా లేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అమెపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక అంతకుముందు బీజేపి, ఆర్ఎస్ఎస్ లు జాతీయవాదం గురించి తరుచూ మాట్లాడటాన్ని కూడా అమె విమర్శలు గుప్పించారు.
అసలు దేశ స్వతంత్ర్య పోరాటంలో ఏ మాత్రం పాత్రలేని బీజేపి, ఆర్ఎష్ఎస్ లు స్వతంత్ర్యం తీసుకువచ్చిన పార్టీలపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అమె ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటామన్న నేపథ్యంలో వెనక్కు తగ్గిన బీజేపి అధిష్టానం.. ఆమె చేరికకు ఎర్రజెండాను చూపిందన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే అమెను కొంత అలస్యంగానే పార్టీలోకి చేర్చుకోవచ్చన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. మరి దీనిపై కార్యకర్తలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more