నవ్యాంధ్రలో ప్రస్తుతం ‘ఛీప్ పాలిట్రిక్స్’ జరుగుతున్నాయి. ఓవైపు నాలుగో రాజ్యసభ స్థానం పై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇరు పార్టీలు టెన్షన్ పడిపోతున్నాయి. పెద్దల చిచ్చుతో కాస్త తడబడ్డ టీడీపీ ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటిస్తే, ఇటు వైసీపీ ఏకగ్రీవం కోసం ఫ్లాన్ వేస్తోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్ పార్ట్ 2 కి చంద్రబాబు తెర లేపడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వైసీపీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ప్రకాశం నుంచి మరో ఇద్దరు రెడీగా ఉన్నారు. అంటే మొత్తం 19 మంది. కానీ, రాజ్యసభ స్థానం కోసం మద్ధతు కావాలంటే బలం 36 కావాలి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలకు గాలం వేసేందుకు అల్రెడీ జంప్ అయిన వారి సహకారం తీసుకోనున్నాడు చంద్రబాబు. జలీల్ ఖాన్, సుజయకృష్ణ రంగరావు, గొట్టిపాటి రవి ఇప్పటికే రంగంలోకి దిగి తమతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలను లాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ పాత సహచరులతో ఓట్లు వేయించి నాలుగో అభ్యర్థిని గెలిపించే బాధ్యత వీరే తీసుకున్నట్లు సమాచారం.
నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డిప్రభాకర్ రెడ్డికి ఈ అవకాశందక్కే అవకావాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేర సిద్ధంగా ఉండాలని ఆయనకు సంకేతాలు కూడా పంపారంట. అయితే కొంతమంది సీనియర్లు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. గత ఏడాది తెలంగాణ కౌన్సిల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 5వ అభ్యర్థిని నిలిపింది. సరిపడా బలం లేకపోయినా ఎలా చేశారంటూ అప్పుడు టీడీపీ దుమ్మెత్తిపోసింది. ఇప్పుడు నాలుగో అభ్యర్థిని దింపినా అలాంటి విమర్శలే రావొచ్చని వారంటున్నారు. ఈ విషయంలో ప్రస్తుతానికి సస్పెన్స్ మెయింటెన్ చేయాలని నేతలకు బాబు సూచించాడంట.
మరోవైపు ఆకర్ష్ కి లొంగ కుండా తన ఎమ్మెల్యేలను కట్టడి చేసే పనిలో ఉన్నాడు జగన్. అల్రెడీ జంప్ అయిన ఎమ్మెల్యేలతో మిగాతావారికి సంబంధాలు లేకుండా వారి ఫోన్ లను స్విఛ్ఛాప్ చేయించటంతోపాటు, ఇంకొందరిని ఏకంగా విదేశీ పర్యటనలకు పంపించాడంట. అదే క్రమంలో అసంతృప్తితో ఉన్న నేతల కోరికలను తీర్చేందుకు ఆయన సిద్ధమయ్యాడు కూడా. ఎన్నికలు జరిగే 11వ తేదీ వరకు వారిని కట్టడి చేయగలిగితే చాలన్నది ఆయన ఉద్దేశం. అలాగే టీడీపీతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా జగన్ ఓ కన్నేసి ఉంచాడు. ఇందుకోసం విజయసాయిరెడ్డియే స్వయంగా వారి వారి ఇళ్లకు పంపి వారి సమస్యలు తీర్చాలని చెబుతున్నాడంట. ఆర్థిక సమస్యలతో సైకిల్ ఎక్కుదామని రెడీగా ఉన్న ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి విజయసాయిరెడ్డి ఆయన సమస్యను పరిష్కరించినట్లు తెలుస్తోంది. ఇదే బాటలో ఉన్న మరికొందరి డిమాండ్లు కూడా నెరవేర్చాలని, ఎట్టి పరిస్థితుల్లో వారు చేజారకుండా చూడాలని సీనియర్లకు జగన్ సూచించాడంట. ఒకవేళ వరకూ టీడీపీ నాలుగవ అభ్యర్ధిని నిలబెట్టకపోతే వైసీపీ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది కాబట్టి ఆ రోజు తమ ఎమ్మెల్యేలను అజ్నాతంలోనే ఉండేలా జగన్ చూసుకుంటున్నాడు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more