ఏపిలో జగన్ కు గడ్డు పరిస్థితి ఉంది. వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీలోకి చేరిపోతున్నారు. అయితే అంతకు ముందు వైయస్ జగన్ చేసిన ప్రకటన ఓ రకంగా తెలుగుదేశం నాయకులకు చెమటలు పట్టించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మత్తి గళాలను పోగేసే పనిలో జగన్ విఫలమయినట్లు వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని రామవరప్పాడులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ పేదల పూరి గుడిసెలను తొలగించేందుకు విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు యత్నించారు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడకు చేరుకుని.. పేదలకు అండగా నిలిచారు. అంతేకాక బాధితులతో కలిసి అక్కడే జాతీయ రహదారిపై ఆయన ధర్నాకు దిగారు. వంశీకి మద్దతుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రామవరప్పాడు బాధితులను పరామర్శించారు. బాధితుల ఆందోళనలకు మద్దతు తెలిపిన జగన్.. వారి తరఫున కోర్టుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీనితో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు వైఎస్ జగన్ మద్దత్తు ఇచ్చినట్లు అయింది. దీంతో ఎన్టీఆర్ కు అంత్యత ప్రాణమిత్రుడైన వంశీ కూడా జగన్ కోటరీలో ఉన్నాడట
మరోవైపు టీడీపీలో ప్రాధాన్యత తగ్గడంతో ఎన్టీఆర్ కు, హరికృష్ణ గుర్రుగా ఉన్నారంటా..దీన్ని అవకాశం చేసుకొనే రాజ్ భవన్ ముందు 21మంది ఎమ్మెల్యేలు వస్తే గంటలో బాబు సర్కారును కూల్చేస్తాను. టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారు, వాళ్ల పేర్లు చెప్పిన గంటలో సర్కారు పడిపోతుందని అన్నారట. అలా అన్న జగన్ నిజంగానే….బాబు సర్కారు కూల్చే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ ను, హరికృష్ణ ను, వల్లభనేని వంశీని, మరికొంతమంది టీడీపీనేతల్ని.., వైసీపీలో చేర్చుకోగలిగితే టీడీపీ సర్కారును కూల్చడం పెద్ద విషయం ఏమీ కాదని సమాచారం. కానీ జగన్ దీన్ని ఉపయోగించుకులేక చతికిల పడ్డారని రాజకీయ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more