లలిత్ గేట్ వ్యవహారంపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ లోక్సభలో భావోద్వేగానికి గురై ఆవేశంగా ప్రసంగించినంత మాత్రాన విపక్షాలు ఈ అంశాన్ని పక్కనబెట్టడం లేదు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పినా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపినా.. విపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయక తప్పదు. అయితే విపక్షాలను తప్పబట్టడం కూడా సమంజసం కాదు. బీజేపి సీనియర్ జాతీయ నేతగా, ప్రధాని అభ్యర్థి స్థాయికి ఎదిగిన సుష్మాస్వరాజ్ ను టార్గెట్ చేయడంతో.. ప్రధాని మోడీపై ఒత్తడి పెరిగి అమెను మంత్రిమండలి నుంచి తొలగిస్తే.. అది తమ విజయంగా మారుతుందని విపక్షాలు యోచిస్తున్నాయి. అంతేకాదు.. దీంతో మోదీ ప్రభుత్వం కూడా అవినీతి మయం అయ్యిందన్న సంకేతాలను యావత్ దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లి.. మోడీ మానియాకు బ్రేకులు వేయవచ్చని ప్రతిపక్షాలు బావిస్తున్నాయి.
లలిత్ మోదీ కోసం తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. సిఫార్సు చేసిన ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, తనపై ఆరోపణలకు సంబంధించి చర్చ జరగాలని అమె డిమాండ్ చేశారు. నిజంగా కేంద్రమంత్రి ఎలాంటి తప్పు చేయని పక్షంలో అమె రాజీనామా చేయడానికి ఎందుకు వెనకంజ వేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపణలు నిజం కాదని స్పష్టం చేసుకున్న తరువాత మళ్లీ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు కదా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
కేంద్రమంత్రి హోదాలో తాను కేవలం ఒక భారత నారిగా.. మానవత్వంలో లలిత్ మోడీకి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వానికి సిఫార్సు చేశానని అమె స్వయంగా మీడియాతో చెప్పారు. తాను లండన్ వెళ్లినప్పుడు లలిత్ మోడీ తనను కలిశారని కూడా చెప్పింది నిజం కాదా..? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనికి తోడు సుష్మస్వరాజ్ భర్త లలిత్ మోడీ తరపు న్యాయవాదిగా వ్యవహరించడం లేదా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుష్మాస్వరాజ్ కూతురు కూడా మోదీ వద్ద కొన్నాళ్లు పనిచేశారని వచ్చిన వార్తాల్లో నిజం వుందా లేదా..? అన్నది కూడా కేంద్రమంత్రే సమాధానం చెప్పాలి.
లలిత్ మోడీ భార్య, భారతీయ నారి అని, అమె క్యాన్సర్ బారిన పడటంతోనే తాను బ్రిటన్ అధికారులకు ట్రావెల్ డాక్యుమెంట్ల విషయమై సిఫార్సు చేశానని చెబుతున్న కేంద్రమంత్రి.. అమెకు నిజంగానే క్యాన్సర్ వుందా..? అన్న విషయాన్ని నిర్థారించుకున్నారా..? దేశం నుంచి కోటాను కోట్ల రూపాయల నిధులను దారిమళ్లించి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన మోడీ.. ఇటీవలి కాలంలో ట్విట్టర్ ద్వారా చేసిన కామెంట్లు, పోస్టులను అందరూ చూశారు. తన దాకా వస్తే ఎవరినీ వదలనని హూంకరింపులకు కూడా చేశారు. అలాంటి వ్యక్తి తన అక్రమంగా వున్న డబ్బుతో.. భారత్ దేశంలో ఎలాంటి ఓప్పందాలు లేని దేశాలకు పారిపోయేందుకు నకిలీ వైద్య సర్టిఫికేట్లను కూడా తీసుకుని వుండవచ్చని కదా..? మోడీ సర్టిఫికెట్లు నిజమని ఎలా విశ్వసించారు..? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
మీరు మా చిన్నమ్మే.. భారత నారే. అనుభవజ్ఞులైన రాజకీయ నేతే.. అయితే మీ మంచి తనాన్ని అవతలి వ్యక్తి తనకు అవకాశంగా మలుచుకున్నాడా..? ఏది నిజం.. ఏది అబద్దం ఎలా తెలిసేది అమాత్యుల వారు. తాను వ్యక్తిగా సాయం చేస్తే.. ఎవ్వరూ ఏమీ పట్టిచుకోరు, పైగా తనపై ప్రశంసలు కురిసిస్తారు. అదే కేంద్రమంత్రి హోదాలో ఏ పని చేసినా.. దాని పూర్వపరాలను పలుమార్లు శోధించాల్సిన అవసరం వుంటుంది. ఎందుకంటే అది ప్రభుత్వానికే కాదు.. దేశంతో విదేశాలకు వున్న సంబంధాలపై కూడా ప్రభావం చూసే అస్కారముంది కనుక. ఇలాంటి చిన్న విషయాలను మర్చిపోయి క్యాన్సర్ రోగి సాయం చేయడం కూడా నేరమేనా..? అమెను చనిపోనివ్వాలా అంటూ ఎదురుదాడి చేస్తున్న సుష్మాజీ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా..? అంటూ విపక్షాలు ఆందోళనను మరింత తీవ్రతరం చేయనున్నాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more