కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. ఎంత మాటకారి అంటే.. ఆయన వ్యాఖ్యాలను అర్థం చేసుకోడానికి రాజకీయ నాయకులకే చాలా సమయం పడుతుంది. ఏ అంశంపైనా కానీ, అనర్గళంగా మాట్లాడగల మంచి వక్త కూడా. అయితే ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యాలలోని పరమార్థం మాత్రం తెలంగాణ ప్రజలను సందిగ్థంలోకి నెట్టాశాయి. దేశంలోని ఏ రాష్ర్టాల మధ్య వివాదాలు చెలరేగినా.. కేంద్రం జోక్యం చేసుకోదని, అది తెలుగు రాష్ట్రాలైతే నేమి, లేక మరోకటి అయితేనేమి అని ఆయన అన్నారు. ఇంతవరకు బాగానే వున్నా ఇక్కడే అసలు విషయం బొధపడక తెలంగాణ ప్రజలు బుర్రలకు పదునుపెడుతున్నారు. అదేంటంటారా..?
సెక్షన్-8పై రెండు రాష్ర్టాలు కేంద్రాన్ని సంప్రదిస్తే ఈ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పడమే తెలంగాణ అధికార, విపక్ష పార్టీలతో పాటు తెలంగాణ ప్రజలను కూడా తికమక పెడుతోంది. ఓటుకు నోటు కేసు వ్యవహరామన్ని రోజుల మిన్నకుండిన వెంకయ్య.. ఇప్పడు సెక్షన్ 8 పై మాత్రం రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదిస్తే.. ఈ అంశాన్ని పరిశీలించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అవినీతి బాగోతానికి తెరలేపిన టీడీపీకి వెనకేసుకువస్తున్న కేంద్రం.. మిత్రపక్షంపై చర్యలు తీసుకోకుండా.. సెక్షన్ 8 అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం.. కేంద్రం పక్షఃపాత ధోరణికి నిదర్శనమని తెలంగాణ వాదులు విమర్శలు గుప్పిస్తున్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more