ఎక్కడైనా జాబు కావలెను అన్న వెకెన్సీ బోర్డులు చూసి ఉంటారు కానీ ఇలా ఓ పార్టీకి అధ్యక్షుడు కావలెను అని ఎక్కడైనా విన్నామా..? కన్నామా..? అన్న అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలా ఉంది మరి. అందుకే ఏపి టిడిపికి అధ్యక్షుడు కావలెను అన్న టైటిల్ తీసుకున్నాం. ఇక విషయానికి వస్తే గత కొంత కాలంగా టిడిపి పార్టీని జాతీయపార్టీగా మార్చడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగన్, చంద్రబాబు నాయుడు గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్కనున్న రాష్ట్రాల్లో కూడా సభ్యత్వాన్ని నమోదు నిర్వహిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే మరి ఏపికి అధ్యక్షుడిగా ఎవరు కావాలన్న దానిపై చర్చ సాగుతొంది.
తెలుగుదేశం పార్టీకి వచ్చే నాలుగేళ్లలో రోడ్ మ్యాప్ను ఖరారు చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిని నియమించారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక పార్టీ అధ్యక్షుడిని నియమించాలని, చంద్రబాబునాయుడిని జాతీయాధ్యక్షుడిగా ఎన్నుకోవాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఏపి పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక విషయమై నారా లోకేష్ అభిప్రాయాలు, మనోగతానికి అనుగుణంగా నడుచుకోవాలనే భావనతో బాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఏపి అధ్యక్షుడిగా ఎవరి పేరు అన్న దానిపై సందిగ్దత నెలకొంది. ఏపిలో చంద్రబాబు తర్వాత అంత పేరున్న నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక్క యనమల రామకృష్ణుడు తప్ప.. ఆ స్థాయి నాయకులు లేరని వార్త. మరి అందుకే ఎన్టీఆర్ భవన్ ముందు ఏపి టిడిపికి అధ్యక్షులు కావలెను అన్న బొర్డ్ తగిలిస్తారని బయట గుసగుస. మరి అది నిజమో కాదో చంద్రబాబు నాయుడికే తెలియాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more