ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా బాధ్యతలు చేపడుతున్న నరసింహన్ కు పదవిగండం వున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఆ దిశగా పావులు కదుపుతోందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వున్న లోపాలను సవరించడంలో నరసింహన్ ఫెయిల్ అవుతున్నారని, ఇరురాష్ట్రాల సమన్వయతను సమకూర్చడంలో ఈయన వెనుకబడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇద్దరు గవర్నర్లను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని వార్తలొస్తున్నాయి.
ఇదిలావుండగా.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గవర్నర్ పదవుల్లో కొనసాగిన మాజీ కాంగ్రెస్ నేతల్ని తొలిగించిన విషయం తెలిసిందే! తమవాళ్లను ఆ పదవుల్లో కూర్చోబెట్టేందుకు అప్పట్లో కమలనాథులు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి కేంద్రం గవర్నర్ పదవుల మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈసారి బీజేపీ తయారుచేసుకున్న రెండో విడతలో ఆంధ్ర, తెలంగాణ గవర్నర్ నరసింహన్ కూడా వుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. తొలిదశలో కాంగ్రెస్ ముఖ్యనేతల్ని ఇంటిదారి పట్టించిన బీజేపీ.. ఇప్పుడు రెండో విడతలో భాగంగా కాంగ్రెస్ సానుభూతిపరులుగా పేరొంది, గవర్నర్ పదవులు పొందిన వారిని సాగనంపే ఏర్పాటు చేస్తోందట!
అయితే... ఇక్కడ గవర్నర్ నరసింహన్ ను తొలగించే అవకాశం లేదని మరికొందరు అంటున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ హయాంలో వున్నప్పుడు అప్పటి మంత్రులకు ఎంత విధేయుడిగా నరసింహన్ పనిచేశారో.. అలాగే ఎన్డీయే అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటివారితో అంతే విధేయతను చూపుతున్నారు. అందరితోనూ కలిసిమెలిసి తన పదివిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు బాగానే చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరి.. రానున్న రోజుల్లో నరసింహన్ గవర్నర్ గా కొనసాగుతారా..? లేదా..? అన్నది వేచి చూడాలి!
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more