మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అంతకంతకూ వేడెక్కుతున్నాయి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సహజనటి జయసుధలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మా ఎన్నికల్లో కొత్తగా రాజకీయ రంగు రాసుకుంటోంది. గతంలో పదవి వెలగబెట్టిన వారే మరోసారి తమ ప్రభావాన్ని చూపించాలని అనుకుంటున్నారు. అందుకే వెనక నుండి రాజకీయాలను నడపాలని ప్రయత్నిస్తున్నారు. ఓటింగ్ లో జరిగే అవకతవకలపై రెండు వర్గాలు విమర్లు చేసుకుంటున్నాయి. అయితే సెల్ ఫోన్లకు, నోట్ల కట్టలకు కళాకారులు అమ్ముడు పోయే స్థితిలో లేరని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో నిన్నటి దాకా ఉన్న వాతావరణాన్ని ఈ ఎన్నికలు పాడు చేశాయని అందరూ ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'మా'లో రాజకీయ నాయకుల జోక్యం తీసుకురావోద్దని జయసుధ ఆరోపణలు చేయడం, వాటిని రాజేంద్ర ప్రసాద్ ఖండించారు. జయసుధ వర్గం బెదిరింపులకు పాల్పడుతుందని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.
అయితే తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మా ఎన్నికలలో సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారట. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతో జయసుధ రాజకీయాలలో అడుగుపెట్టారు. కానీ, ప్రస్తుతం ఆమెకు మద్దతునిస్తుంది తెలుగుదేశం పార్టీ ఎంపి. మురళీ మోహన్. అలాంటప్పుడు ఆమె జగన్ మద్దతు ఎందుకు కోరతారు అనేది ప్రశ్న. మరోవైపు గెలవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడానికి జయసుధ సిద్దంగా లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. జయసుధ వెనుక మురళీమోహన్ ఉన్నారు కనుక రాజేంద్ర ప్రసాద్ జగన్ వద్దకు వెళ్లారనే ప్రచారం జరుగుతుంది. అందువల్ల ఎవరికి మద్దతుగా జగన్ రంగంలోకి దిగారు అనే విషయంలో స్పష్టత లేదు. మొత్తానికి ఎన్నికలు అంటే ఎంత రసవత్తరంగా సాగుతాయో ప్రస్తుతం జరుగుతున్న మా ఎన్నికలను చూస్తేనే అర్థమవుతుంది. మరి జగన్ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది తెలియడం లేదు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more