సబ్బం హరి గురించి తెలియని రాజకీయ నాయకులు లేరు. ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు కోవర్టుగా పని ఘనత సబ్బం హరికే దక్కింది, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. జగన్ కు , ఆయన పార్టీకి మద్దుతు ఇచ్చిన ఏకైక నేత సబ్బం హరే. అయితే రాష్ట్ర విభజన సమయంలో.. జై సమైక్యాంద్ర ఎజెండాను నెత్తిన పెట్టుకొని ఇప్పటివరకు తిరిగిన వ్యక్తి సబ్బం హరి.
సుప్రీం కోర్టు .. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వేసిన ఫిటిషన్ పరిశీలించి .. సమైక్యవాదుల ఆశలపై నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. దీంతో జై సమైక్యాంద్ర పార్టీలోని నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు గురించి మిట్ నైట్ ఆలోచించి, తెల్లవారిన వెంటనే సబ్బం .. జై సమైక్యాంద్ర జెండాను పీకిపారేసి, మీడియా ముందుకు వెళ్లి నేను ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నాను అని చెప్పటంతో వైఎస్ జగన్ కుప్పకూలినట్లు సమాచారం.
జగన్ కు సబ్బం హరి మద్య ఉన్న సన్నిహిత సంబంధం చాలా ద్రుడమైనదని అందరికి తెలుసు. కాకపోతే.. కొద్ది రోజులు ఈ ఇద్దరి మద్య మాటలు లేవని రాజకీయ నేతలు అనుకుంటున్నారు. కానీ చీకట్లో రాజకీయలు చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు సబ్బం కూడా విశాఖ బరినుండి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. తాజాగా సుప్రీం కోర్టుతీర్పుతో సమైక్యం ఇక కుదరదని విభజన జరిగిపోయిందని తేలిపోయిందని ఇక సీమాంధ్రకు మంచి నాయకత్వం కావాలని ఆయన కోరారు.
అంతేకాదు ఇక ఫైనల్ గా సబ్బం ఎన్డీయేకు మద్దతుగా లోక్ సభ బరి నుంచి వైదొలగినట్లు ప్రకటించారు. ఇదే వ్యవహారంపై అనుచరులతో చర్చించి మీడియా ఎదురుగా అధికారికంగా ప్రకటించారు. కాగా బిజేపీ-టిడిపి పొత్తులో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీ బీజేపీకి అప్పగించింది. ఆ పార్టీ తరఫున సీమాంధ్ర బిజేపీ అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు రంగంలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా బొలిశెట్టి సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఇక వైకాపా నుండి జగన్ తల్లి, విజయమ్మ రంగంలో ఉన్నారు.
ప్రధానంగా కూటమి-వైకాపా మధ్య పోటీఉండగా సబ్బం భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉందని అనుకున్నారు. ఈ క్రమంలో వైకాపా లాభపడుతుందని.. అలాంటి ఆరాచక, దోపిడీ శక్తులు విశాఖలో ఉండకూడదనే తాను ఎన్డీయేకు మద్దతు ఇస్తూ పోటీని విరమించుకున్నట్లుగా ప్రకటించారు. ఇది విజయమ్మకు, ఆ పార్టీకి భారీ గండికొట్టే అవకాశమే ఉన్నట్లుగా తెలుస్తుంది! ఇది జగన్ మోహన్ రెడ్డికి అతిపెద్ద షాక్ అని రాజకీయ మేథావులు అంటున్నారు. సబ్బం హరి సమైక్య జెండా పీకినప్పటి నుండి.. జగన్ చాలా బాధపడుతున్నట్లు .. ఆ పార్టీ కార్యకర్తులు అంటున్నారు.
అంటే విశాఖలో..వైఎస్ విజయమ్మ విజయం పై అనుమానం కలుగుతుందని ఆ పార్టీలో సీనియర్ నాయకులు మథనపడుతున్నారు. కానీ రేపు జరిగే ఎన్నికలకు .. ఒక చీకటి రాత్రి అడ్డుగా ఉన్న విషయం తెలుసుకోవాలి. ఈ చీకటి రాత్రులే..రాజకీయా రంగులు పూర్తిగా మారిపోతాయని సీనియర్ నేతలు అంటున్నారు. తెల్లవారితో ఏం జరుగతుందో చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more