వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, ఆయన కుటుంబ సభ్యులు , పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తల మౌనవ్రతమే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు వరంగా మారినట్లు తెలుస్తోంది. జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు రెచ్చిపోయి మాటల తుటాలు పెల్చుతున్నారు. కొంతమంది వ్యక్తిగత విషయలపై కామెంట్లు చేస్తున్నారు. ఇక కేసిఆర్ గురించి చెపాల్సిన పనేలేదు. అసలే ఆయన మాటల మాంత్రికుడు. ఎప్పుడు, ఎక్కడు, ఎలా మాటలతో యుద్దం పుట్టించాలో, రంగుతున్న మంటల్ని ఎలా ఆర్పాలో తెలిసిన మహా నాయకుడు కేసిఆర్. ఇక ఎన్నికల సమయంలో కేసిఆర్ మాటల దూకుడికి హద్దే లేదని చదువుకున్న యువకులు అంటున్నారు.
కేసిఆర్ మాటల వరదకు.. కాంగ్రెస్, టిడిపి, బిజేపి పార్టీల నాయకులు రెచ్చిపోయి పోటీగా కౌంటర్ ఇస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గానీ, ఆ పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ , ఇప్పటి వరకు తెలంగాణలో కేసిఆర్ పై ఒక్క కామెంట్ కూడా చేయకపోవటం ఆశ్చర్యంగా ఉందని హైదరాబాద్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు ప్రజలు అంటున్నారు.
ఇప్పుడు వరకు వైసీపీ పార్టీ నాయకులు మౌనవ్రతం చేయటంతో.. కేసిఆర్ కు పెద్ద వరంగా మారింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు రెచ్చిపోయి, సీమాంద్ర ప్రజలపై, ఉద్యోగులపై, విమర్శలు గుప్పిస్తున్నారు. నగరంలో ఉంటున్న సీమాంద్ర ప్రజలు భయపడుతున్నారు. హైదరబాద్ నగరంలో 35 లక్షల మంది సీమాంద్ర ప్రజలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వారి ఓటు బ్యాంకు పై కేసిఆర్ అండ్ కో ద్రుష్టి పెట్టింది.
సీమాంధ్రుల ఓట్లు తమకు పడవనే ఉద్దేశంతో టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. విభజన సమయంలో కిక్కురమనని కేసీఆర్, ఇప్పుడు ఓట్ల కోసం పోలవరాన్ని, ఉద్యోగుల ఆప్షన్లను పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయనకు నిజంగా పోలవరం ముంపు గ్రామాలపైన, ఉద్యోగుల పైన ప్రేమ ఉంటే లోక్ సభలో బిల్లు పాసవుతున్నప్పుడు ఏం చేశారు? నిద్రపోయారా? అని నగరంలో సెటిలైన ఉద్యోగులు అడుగుతున్నారు.
అయినా...మేము సమైక్యం, సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడటంలో తమను మించిన వారు లేరని డబ్బా కొట్టుకున్న జగన్, ఆయన పార్టీ నేతలు కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని నగరంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ.. మూడు పార్టీలు కేసీఆర్కు ధీటుగా కౌంటర్ ఇస్తున్నాయి. వైసీపీ మాత్రం మౌనవ్రతం పాటిస్తోందని తెలంగాణ నివసిస్తున్న సీమాంద్ర ప్రజలు అంటున్నారు.
ఇటీవల తెలంగాణాలోని జిల్లాల్లో షర్మిళ ప్రచారం చేసినప్పుడు తెలంగాణలోని సీమాంధ్రుల గురించి మాట్లాడకపోయినా ఎవరూ అంతగా పట్టించుకోలేదు... కానీ హైదరాబాద్ లోని యూసఫ్ గూడ, సనత్ నగర్, ఖైరతాబాద్ ల్లో మాట్లాడినప్పుడు కూడా సెటిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న కేసిఆర్ మాటల గురించి మాట్లాడకపోవడం క్షమించరాని విషయమని నగరంలోని సెటిలర్స్ అంటున్నారు. నగరంలో షర్మిళ నిర్వహించిన సభలే ఇందుకు నిదర్శనమని నగర ప్రజలు అంటున్నారు.
వైసీపీ మౌనవ్రతం చూస్తుంటే ..కేసిఆర్ పార్టీతో కలిసిపోయినట్లుగా ఉందని నగరంలోని నివసిస్తున్న రాజకీయ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more