రాష్ట్రంలో చెయ్యి చచ్చుపడిపోతుంది. హస్తనికి మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు ఒక్కొక్కటిగా కటిఫ్ అవుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ‘‘ఏదో అనుకుంటే.. ఇంకేదో జరుగుతుంది’’ . కేంద్రం లో ఏపార్టీ అయిన నిలబడిలాంటే.. ఆంద్రప్రదేశ్ ఎంపీ సీట్లు చాలా ముఖ్యం. అలాంటి ఆయుధాలతోనే కాంగ్రెస్ హైకమాండ్ అష్టాచమ్మా ఆట ఆడింది.
‘‘యజమాని ఆ ఆయుధం పై ఆదరమరిచి ఉంటే, ఆయుధానికి శత్రువు అవుతాడు ’’ ఆంద్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని నమ్మి పదేళ్ల పాటు .. అధికారంలో కూర్చోబెట్టిన పాపనికి .. తెలుగుప్రజలను విచ్చన్నం చేయటం జరిగింది. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు మోయటానికి కూడా కార్యకర్తలు కరవైయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దెబ్బ దెబ్బ తగులుతుంది.
ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో విన్నూతనమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పొత్తుల ఎత్తులు కొనసాగుతున్నాయి. పాత మిత్రులకు గుడ్ భాయ్ చెప్పి.. కొత్త స్నేహితుల కోసం పరితపిస్తున్నారు.
తాజాగా, ఇన్నాళ్లు కాంగ్రెస్ తో కలసి పని చేసిన ఎంఐఎం.. ఇక మీదట గుడ్ భై అని చెప్పేసింది. ఈరోజు ఉదయం ఎఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ పీసీసీ ప్రెసిండెంట్ బొత్స సత్యనారాయణతో సమావేశమయి స్నేహబంధం వీడుతున్నట్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
దీంతో.. కాంగ్రెస్ మద్దతుతో హైదరాబాద్ మేయర్ గా వున్న ఎంఐఎం నేత మహమ్మద్ మజీద్ హుస్సేన్ రాజీనామా చేయనున్నారు. తెరాసతో జతకట్టేందుకే ఎంఐఎం కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. తెరాసతో పొత్తుపై గత కొన్నిరోజులుగా ఆ పార్టీ నేత కేటీఆర్ ఎంఐఎం నేతలతో చర్చిస్తొన్న విషయం తెలిసిందే.
అయితే ఇంతకీ ఎంఐఎం పయనం ఎటువైపు, దాని వ్యూహం మారుతోంది. ఒక్క తెలంగాణకే పరిమితం అవుతుందా, లేక సీమాంద్రలోను ఉనికి చాటుకునేందుకు స్కెచ్ వేస్తోందా అన్న అనుమానం కలుగుతోంది.
ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ సందేహాలను కలిగిస్తున్నాయి.ఎంఐఎం కు కాంగ్రెస్ కు మద్య కొన్ని దశాబ్దాల స్నేహం ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్ నగరపాలక సంస్థను కూడా ఉమ్మడిగా పంచుకున్నారు.
అయితే హైదరాబాద్ మేయర్ పదవికి మాజిద్ హుస్సేన్ రాజీనామా చేయటం జరిగింది. కాని అదే ఒప్పందం ప్రకారం హైదరాబాద్ డిప్యూటి మేయర్ పదవిని ఎంఐఎం తీసుకోవాలి, కాని అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం.
ఇదే నిజమైతే ఎంఐఎం కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకునే దిశగా పయనిస్తోందని అనుకోవాలి. . గతంలోనే కిరణ్ కుమార్ రెడ్డితో వచ్చిన విభేదాల నేపథ్యంలోనే ఎఐఎం కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి.
అంతే కాదు అప్పట్లో జైల్లో ఉన్న వైకాపా అధినేత జగన్ ను అసదుద్దీన్ కలవడం, అంతకు ముందు ఆ ఇద్దరి ఒవైసి అన్నదమ్ములపై కిరణ్ ప్రభుత్వం కేసులు పెట్టించడం, వారికి కిరణ్ కు మద్య మాటల యుద్దం జరగడం అందరికి తెలిసిందే.
అదే నేపథ్యంలో జగన్ కు తనకు మంచి స్నేహం ఉందని, ఆయనతో కలసి నడవడానికి తమకు అభ్యంతరం లేదన్న వాఖ్యలను కూడా అసదుద్దీన్ చేసారు. దీంతో అప్పుడే ఎంఐఎం కాంగ్రెస్ స్నేహం తెగిపోయినట్టే అనుకున్నారు.
తాజాగా రాష్ట్రం విడిపోవడం, విభజనలో తమ డిమాండ్లను పట్టించుకోలేదని ఎంఐఎం ఆరోపించడం,ప్రధానంగా హైదరాబాద్ శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో పెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కేసిఆర్ స్వయంగా తానే ఎంఐఎంతో పొత్తు గూర్చి చర్చిస్తానని చెప్పడం దీనికి ఉదహరణ.
పొత్తుల కోసం కమిటి వేసినప్పటికి కేవలం ఒక్క ఎఐఎం తో మాత్రం తానే చర్చిస్తానని కేసిఆర్ పేర్కొనడం దీని ప్రాధాన్యతను చాటుతోంది. అంటే కేసిఆర్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో, వైకాపాతో పొత్తు పెట్టుకుని సీమాంద్రలోను తమ పార్టీ ఉనికి కాపాడుకోవాలని ఎంఐఎం ప్లాన్ వేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. . దీంతో కాంగ్రెస్ పార్టీకి ఆంద్రప్రదేశ్ లో నూకలు చెల్లినట్లే అని .. రాజకీయ వర్గాలు అంటున్నాయి.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more