కాంగ్రెస్ హైకమాండ్ వెనకడుగు వేసినట్లు కనబడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవికి రాజీనామా చేయటంతో .రాష్ట్ర పరిపాలన విధానం పై కాంగ్రెస్ హైకమాండ్ ద్రుష్టి పెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని రాజకీయ నాయకులు, మీడియా వర్గాలు హడవుడి చేశాయి.
కానీ హైకమాండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పై వెనకడుగు వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎన్నికలప్పుడు రాష్ట్రపతి పాలన ఉండడం కన్నా ప్రభుత్వం ఉండడమే శ్రేయస్కరమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందని ఢిల్లీ పెద్దలు అంటున్నారు.
రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రపతి పాలన పై వెనకడుగు వేసినట్లు సమాచారం. రాష్ట్రపతి పాలన విదించటం అంటే కాంగ్రెస్ హైకమాండ్ పెద్ద అవనమానం ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. పదేళ్ల నుండి అధికారంలో ఉండి చివరి నిమిషాంలో అధికారిన్ని రాష్ట్రపతి చేతిలో పెడితే.. రాబోయే ఎన్నికల్లో కొన్ని కష్టాలు ఎదురవుతాయని భావించి, రాష్ట్రపతి పాలనపై వెనకడుగు వేసినట్లు పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.
ఇప్పటికే సీమాంద్ర కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుల సైతం పక్క పార్టీలోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే. అసలే పార్టీకి బలం లేదు, బలనిరూపణ వస్తే ఎవరైనా అవిశ్వాసం పెడితే పరువు పోతుందా అంటే ఆ అవకాశము లేదు, పట్టుమని వారం పదిరోజులో అన్నట్లుగా ఉన్న ప్రభుత్వంపై ఎవరు ఆ పని చేయరు.
ఈ దశలో అధికారంలో ఉంటే రానున్న ఎన్నికల్లో కొంతలో కొంతయినా లాభం ఉంటుంది. లేకుంటే పట్టించుకునే వారు లేకుండా పోతారని పార్టీ పెద్దలు ఆలోచించి , రాష్ట్రపతి పాలన పై వెనకడుగు వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచరం.
ఇప్పుడు రాష్ట్రంలో రాజీనామా చేసిన నల్లారి బాబు కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్న విషయం కాంగ్రెస్ హైకమాండ్ ద్రుష్టి పెట్టింది. ఇక జగన్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీల్లోకి వెళ్లే అవకాశం లేని నాయకులుగా బొత్స, కన్నా, ఆనం, చిరంజీవి లాంటి వారిని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. ఈ నలుగురితో సీమాంద్రలో బలం పుంజుకోవాలనే ఉద్దేశంతోనే.. రాష్ట్రపతి పాలన పై వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
అంటే సీమాంద్ర కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యింది అనిపించుకోవటం కంటే.. ఇలాంటి నాయకులను నిలబెట్టి, ఒకటి, రెండు సీట్లు దక్కించుకున్న, సీమాంద్రలో బతికి బట్టకట్టినట్లే అని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. రాష్ట్రపతి పాలన కంటే చేతిలో అధికారం ఉంటే.. అధికారంతోనైన ఈ నలుగుర్ని గెలిపించుకోవచ్చు అనే ఆనందంతో రాష్ట్రపతి పాలన ను వెనక్కి నెట్టేశారు.
అయితే రెండు మూడు రోజుల్లో.. ఈ నలుగురిలో ఎవరో ఒకర్ని ముఖ్యమంత్రిగా చేసి, అధికార్ని తమ వద్దే ఉంచుకోవటానికి కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా ఢిల్లీలో తెలంగాణ నేతలు, సీమాంద్ర నేతలతో చర్చలు జరుపుతుంది. అందుకే సీమాంద్రకు చెందిన నేతనే ముఖ్యమంత్రి చేసే దిశగా ఢిల్లీ పెద్దలు తీవ్ర కసరత్తులు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచరం.
అయిన హైకమాండ్ నిర్ణయానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఏమంటారో చూడాలి. ఇప్పటికే సీమాంద్ర నేతలతో విసిగిపోయమని చెబుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మళ్లీ సీమాంద్ర నేతలకు ముక్యమంత్రి పదవి కట్టబెడతారా ? అనేది చాలా ఆసక్తికరమైన విషయమే. రెండు, మూడు రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more