తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సీమాంద్ర నేతలకు వార్నింగ్ (హెచ్చరికలు) ఇవ్వటం జరిగింది. లోక్ సభలో సీమాంద్ర నేతలు చేస్తున్న రచ్చ పై జైపాల్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేయటం జరిగింది. తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని సీమాంద్ర నేతలు చూస్తే.. హైదరాబాద్ లో ఉన్న సీమాంద్రుల పరిస్థితి ఏమిటో మీరు ఆలోచించుకోవాలని ..జైపాల్ రెడ్డి హెచ్చరికలు జారీ చేయటంపై సీమాంద్ర నేతలు తీవ్రంగా మండిపడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఇరు ప్రాంతాల నాయకులు విడిపోయిన విషయం తెలిసిందే. ఇక కలిసి ఉండటం అనేది జరగదని జైపాల్ రెడ్డి సీమాంద్ర నేతలకు గుర్తు చేయటం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ అడ్డుపడి. తరువాత మీరు హైదరాబాద్ లో ఎలా జీవిస్తారు, తరువాత హైదరాబాద్ ను మీరు పాలించగలరా? హైదరాబాద్ లో ఉణ్న సీమాంద్రులకు రక్షణ కల్పించగలరా? ఇప్పటికే ప్రజలు రెండు ప్రాంతాలుగా విడిపోయారు కాబట్టి, తెలంగాణను అడ్డుకోవద్దని జైపాల్ రెడ్డి వేడుకున్నారు.
అదే సమయంలో జైపాల్ రెడ్డి , తెలంగాణ ఆగితే.. ప్రజల మద్య వైషమ్మాలు రగిలి, ఆత్మాహుతి దళాలు ఏర్పాడు సీమాంద్ర ప్రజలు ఉంటున్న ప్రాంతంలోకి వెళ్లి బాంబులు పేల్చుకుంటే ఏం జరుగతుందో సీమాంద్ర నేతలు ఆలోచించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అనటంతో.. రాజకీయ మేథావులు మండిపడుతున్నారు.
తెలంగాణ ఇచ్చేది .. కాంగ్రెస్ పార్టీ? సీమాంద్ర ప్రాంత నాయకులు కాదు, ప్రజలు అంతకంటే..? తెలంగాణ ప్రజలు , నేతలు విడిపోతం అని కేంద్రం ముందు అర్జీ పెట్టుకున్నారు. అలాగే సీమాంద్ర నేతలు, ప్రజలు .. కలిసే , ఉంటాడం, మమ్మల్ని విడదీయకండని.. కేంద్రానికి సీమాంద్ర ప్రాంతం వారు అర్జీ పెట్టుకున్నారు.
రెండు ప్రాంతాల అభ్యర్థనలను కేంద్రం తీసుకొని, ఆలోచించి , తెలంగాణ ఇవ్వటానికి సిద్దమైందనే విషయం అందరికి తెలుసు. ఇప్పుడు తెలంగాణ ఇవ్వటానికి కేంద్రం ఇష్టమైనప్పుడు .. సీమాంద్రనేతుల .. కేంద్రం పై యుద్దం చేస్తున్నారే తప్ప .. తెలంగాణ నేతల మీద గానీ, తెలంగాణ ప్రజల మీద గానీ చేయటం లేదు.
ఇప్పటి వరకు సీమాంద్ర నేతలు, సీమాంద్ర ప్రజలు .. ఒక్క తెలంగాణ నాయకుడి, తెలంగాణ ప్రజలపై ఎలాంటి కుట్ర పూరిత ప్రకటనలు చెయ్యలేదు. కానీ ఇరుప్రాంతాల నాయకులు రాజకీయ విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో .. తెలంగాణకు పెద్దన్నగా ఉన్న జైపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్య చేయ్యటం మంచిది కాదని రాజకీయ మేథావులు, ఆంద్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ అంటున్నారు.
జైపాల్ రెడ్డి ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి.. ‘‘ఓడిపోతున్నవాడికి.. గెలవలనే తపన,ఆవేశం ఆటోమెటిక్ గా వస్తాయి. అలాగే గెలిచేవాడికి.. ఆనందం, ధైర్యం ఆటోమెటిక్ గా వస్తాయి.’’ గెలిచేవాడు లో ఓపిక నశించిపోయి.. ఓడిపోతున్నవాడి మీద కామెంట్స్ చేస్తే.. అది పగ. ప్రతీకారాలు మారుతాయేని చిన్న విషయం జైపాల్ రెడ్డి ఎలా మరిచిపోయారని రాజకీయ మేథావులు అడుగుతున్నారు.
ఇప్పుడు సీమాంద్ర నేతలు గానీ, సీమాంద్ర ప్రజలు గానీ దాడి చేస్తుంది.. కాంగ్రెస్ పార్టీ మీదే గానీ.. తెలంగాణ ప్రాంతం వారి మీద కాదని సీమాంద్ర సీనియర్ నాయకులు అంటున్నారు. అయిన ఎవరికైన స్థానం బలం ఉంటుందనే విషయం విన్నం గానీ.. ఇలా జైపాల్ రెడ్డి ఉద్రేకశక్తులను రెచ్చగోట్టే విధంగా మాట్లాడటం మంచికాదని .. సీమాంద్ర ప్రజలు అంటున్నారు.
‘‘ఆవేశం ఉన్న వాడు అరుస్తాడు.. ఆనందం వచ్చినవాడు పండగ చేసుకుంటాడు’’ రాష్ట్రం విడిపోతుందనే బాధలో సీమాంద్ర నేతలు ఉన్నారు. అలాగే తెలంగాణ వస్తుందన్న ఆనందంలో తెలంగాణ నేతలు ఉన్నారు. ఎవరికి ఏ న్యాయం చెయ్యలో తెల్చేది అధికారంలో ప్రభుత్వం.
నిన్నటి వరకు కలిసే ఉన్నాం, విడిపోయేటప్పుడు.. పగ, ప్రతీకారంతో విడిపోవటం అవసరమా జైపాల్ రెడ్డి గారు.. ఒక సీనియర్ నేతగా ఉండి.. ఇలాంటి చీపు పాలిటిక్స్ చేయకండని.. రాజకీయ మేథావులు అంటున్నారు. ఒక వేళ తెలంగాణ ఆగితే.. అది సీమాంద్ర నేతల తప్పు కాదని, (వారి విజయం కాదు) కేవలం కాంగ్రెస్ ఆడుతున్న నాటకమే అని తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని సీమాంద్ర ప్రజలు ప్రజలు అంటున్నారు.
ఏ ఓటు కోసం .. ఆంద్రప్రదేశ్ ను విడదీస్తుందో.. అదే ఓటు కోసం .. తెలంగాణ ఆపితే .. తెలంగాణ నేతలు ఏం చేస్తారు? మళ్లీ ఉద్యమబాట పడతారా? లేక కాంగ్రెస్ పార్టీపై యుద్దం ప్రకటిస్తారా? రాజకీయ నాయకులుగా ఆలోచించకండి.. ఒక సామాన్యుడిగా ఆలోచించండని.. తెలుగు ప్రజలు అడుగుతున్నారు. రాజకీయ నాయకులారా .. ఇక జరిగిన నష్టం చాలు. త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపి.. భవితరాలు.. భవిష్యత్తు బాటలు వేయడండని , బడి బాట వదిలి, సమ్మె బాట పట్టిన.. స్కూల్ పిల్లులు.. అడుగుతున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more