రాష్ట్ర రాజకీయల్లో అన్ని అనుమానాలే. ఒక్కటి నిజంలేదనే విషయం తెలుస్తోంది. ప్రధాన మంత్రి దగ్గర .. పార్టీ కార్యకర్త వరకు అన్నీ అనుమానాలతోనే కాలం వెల్లబుచ్చుతున్నారు. దేశానికి సంబంధించిన ఏదైన నిర్ణయం తీసుకుంటే.. పార్టీ అద్యక్షరాలు.. సోనియా గాంధీ ఏమన్నా అనుకుంటుందేమో అని అనుమానంతో ప్రధాన మంత్రి మౌనం అనే ఆయుధంతో బతుకుతున్నారు.
ఇక రాష్ట్రపతి కూడా నిన్నటి వరకు .. అందరికి న్యాయం చేసే వారి స్థానంలో ఉన్న వ్యక్తి . కానీ రీసెంట్ గా 60 ఏళ్ల నుండి రగులుతున్న సమస్యపై.. ఒకే ఒక్క రోజులో ఆమోదం ముద్రం వేసి, సోనియా గాంధీ చేతిలో పెట్టడం వెనుక ఎన్నో అనుమానాలు.
మామ అత్తాల కాలం నుండి నలుగుతున్న సమస్యపై ..కోడలు నిర్ణయం తీసుకోని, అత్త ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పారేయటం పై.. చాలా అనుమానాలు ఉన్నాయని బీజేపి పార్టీ నాయకులు ప్రతి రోజు గోల చేస్తున్నారు.
ఆంద్రప్రదేశ్ లో అగ్గీ రాజేసింది.. కాంగ్రెస్ కాబట్టి.. తెలంగాణ సమస్యను తీర్చి .. ఎక్కడ ఓట్లు దండుకుంటుందోనని.. నిత్యం అనుమానంతో కుమిలిపోతున్నకమలనాధులు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందేమో అనే అనుమానంతో.. ప్రతిరోజు నలిగిపోతున్నారు.
ఇక పార్టీలోని నాయకులు.. రాబోయే ఎన్నికల్లో గెలుస్తోమో లేదో అనే అనుమానంతో.. రాజకీయ పదవులు అనుభవిస్తూ ..అనుక్షణం నరకం అనుభిస్తున్నారు. ఈ ప్రజలు ఏపార్టీకి ఓటు వేస్తే.. ఆపార్టీ అధికారంలోకి వచ్చి, ఏ కొత్త సమస్యలు స్రుష్టిందోనని అనుమానంతో ఎన్నికల తేదీపై నిరాశగా ఎదురుచూస్తున్నారు.
ఇక మిగిలింది తెలంగాణ సమస్య.
ఎక్కడు కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ ను విడగొట్టి, తెలంగాణ రాష్ట్రం ఇస్తుందోనని.. ప్రతి సెకను అనుమానంతో సీమాంద్ర నాయకులు , సమైక్యవాదులు రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీమాంద్ర నాయకులు అయితే.. కోపంతో రగిలిపోతున్నప్పటకి., సొంత పార్టీ మీద తిరుగుబాటు చేయలేక, కాంగ్రెస్ హైకమండో వెన్నపూచిన టి-కత్తితో గుచ్చుతున్నప్పటికి.. సైలెంట్ గా సాగిపోతున్నారు. కారణం ప్యూచర్ ఊహించుకోని.. సొంత పార్టీ పై తిరుగుబాటు చేయలేకపోతున్నారు.
ఒకవేళ రాబోయే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అప్పుడు మా పరిస్థితి ఏమిటి? సమైక్యంద్ర కోసం మేమం చేసిన యాగీ పనులను అధిష్టానం గుర్తుపెట్టుకొని.. పగ తీర్చుకుంటుందోమో అని సీమాంద్ర నాయకులు అనుమానం తో రాజకీయ జీవితం గడుపుతూ.. తెలంగాణ బిల్లు ను వ్యతిరేకించలేక చవట సన్యాశుల్లా నిత్యం చస్తూ బతుకుతున్నారు.
అయితే సీమాంద్ర ప్రజలు మాత్రం సీమాంద్ర నాయకులు ఏదైన చేసి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారని మొదట అనుకున్నారు. కానీ .. సీమాంద్ర నాయకులు రోజుకు ఒకరు చొప్పున హైకమాండ్ బెదిరింపులకు, తాయిలలాకు లోబడిపోడే .. సైలెంట్ గా ఉన్నారనే అనుమానం సీమంద్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.
ఇక తెలంగాణ నేతలు , ప్రజలు ..
అరవైఏళ్ల కల.. ఇటలీ అమ్మ ద్వారా నేరవేరపోతుందనే ఆనందంలో ఉన్నారు. ఇక తెలంగాణ వస్తుందనే ఉద్దేశంలో.. ఇటలీ అమ్మను.. బొమ్మగా మలిచి గుడికడుతున్న పరమభక్తుడు తెలంగాణలో ఉన్నారు. కానీ .. సీమాంద్ర నాయకులు తెలంగాణ రాకుండా కుట్ర చేస్తున్నారనే అనుమానం .. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెల్లవార్లు అనుమానంతో నిద్రపోకుండా మేల్కోంటున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రం తేవటం మా పార్టీ వల్లే అవుతుందని పైకి చెప్పకపోయిన, ఆ గాంభీర్యంతో ప్రతి రోజు మీడియా ముందు సీమాంద్ర నాయకులపై దుమ్మెత్తిపోస్తూ, తెలంగాణ రాకుండా ఎక్కడ ఆగిపోతుందనే అనుమానంతో రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ తెలంగాణ వస్తే.. పార్టీని విలీనం చేస్తే.. మాకు మంచి పదవులు వస్తాయో లేదో అనే అనుమానం ఆ పార్టీ నాయకుల్లో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక తెలంగాణ బిల్లు పార్లమెంటుల్లో పాస్ అవుతుందో... లేదో , ఒకవేళ పాస్ కాకపోతే పరిస్థితి ఏమిటి అనే అనుమానంతో తెలంగాణ నేతలు ఆలోచిస్తున్నారు. బిజేపి తెలంగాణకు అనుకూలమే అని మొదట్లో ఆ నాయకులు చెప్పటం జరిగింది. ఇప్పు డు అదే పార్టీ మాట మార్చటంతో తెలంగాణ బిల్లు కు మద్దతు ఇస్తుందో లేదో అనే అనుమానం తో తెలంగాణ ప్రజలు ఆశగా టీవీల ముందు కూర్చోని చూస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు
ముఖ్యమంగా నాలుగు పార్టీల మనోభావలు. 1) టిడిపి 2) వైఎస్ఆర్ సీపీ 3) లోక్ సత్తా 4) ఎంఐఎం
టిడిపి: సమైక్య రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత, పది సంవత్సరాలు ప్రతిపక్ష నేతల రాజకీయ వ్యూహాలతో జుట్టు తెల్లబడిపోయి.. మరోసారి అధికారం కోసం ఆవురవురుమంటూ.. ఆశగా అనుమానంతో ఎదురుచూస్తున్నచంద్రబాబు నాయకుడు.
రెండు ప్రాంతాలు నాకు రెండు కళ్లు లాంటివి. కాబట్టి ఇరుప్రాంతాల ప్రజలు భాగుండాలని, మొదట తెలంగాణ జై అంటూ అనుమానంగా మొదటి కన్ను కొట్టాడు. బాబు సై అన్నాడు కాబట్టి.. హస్తాం పార్టీ .. తెలంగాణ వారికి అభయ హస్తం అనుమానంగానే ఇవ్వటం జరిగింది. రాష్ట్రం విభజన పై హస్తం .. హడవుడి చేయటంతో.. చంద్రబాబు ఆకారం మార్చి.. జై సమైక్యంద్ర అంటూ.. అనుమానంతో రెండో కన్నుతో.. సీమాంద్ర నేతలకు సైగలు చేయటం జరిగింది.
ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు చంద్రబాబు తెలంగాణ సమస్యపై ఏం చెప్పాలో అర్థంగాక నేషనల్ పార్టీల నేతలతో చీకటి సంసారం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం వస్తుందో లేదో అనే అనుమానంతో.. గాలిమోటర్ ఎక్కి ఆకాశంలో చంద్రబాబు చకర్లు గొడుతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఇది వేసవి కాలం వడగాలుల మద్య పుట్టిన పార్టీ. అవినీతి మరకలు ఉన్నాయని ప్రభుత్వ అధికారులు ఆధారలతో చెబుతున్నప్పటికి, ఆ పార్టీ వారు మాత్రం మేము సముద్రంలో నీరు లాంటి వారిమి. మేము మంచి వారికి మంచి నీరు ఉంటాం. చెడ్డవారికి ఉప్పు నీరులా ఉంటామని అనుమానం తో పార్టీ నాయకులు మీడియా ప్రకటన చేస్తుంటారు. అసలు విషయం ఏమిటంటే.. అవినీతి ఆరోపణలతో.. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లి , బెయిల్ పై బయటకు వచ్చి, ఏదో ఒక రోజు శిక్ష పడుతుందనే.. అనుమానంతోనే..రాజకీయ అడుగులు వేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రక్రియను తెరపైకి తెవటంతో.. వెనక ముందు ఆలోచించకుండా.. జై సమైక్యాంద్ర అంటూ.. అర్థరాత్రి ధర్నాలు, దీక్షలు , సమైక్యగర్జణలు.. చేస్తూ.. రాష్ట్రంలో హడవుడి స్రుష్టించింది. అంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ జై సమైక్యంద్ర అని ఓటు బ్యాంకు ను కొల్లకొట్టుకుందనే అనుమానంతో ఆ పార్టీ సమైక్య అడుగులు వేసి, చివరకు తెలంగాణ బిల్లు అసెంబ్లీ కి వచ్చి సమయంలో.. ఏ మాట్లాడితే..ఏం వస్తుందో అనే అనుమానంతో.. వాకౌట్ చేసిన ఘనత ఆ పార్టీకి దక్కిందని అంటున్నారు.
వైఎస్ జగన్ కేవలం ముఖ్యమంత్రి పదవికోసమే ..పార్టీని స్థాపించి, ఆ పదవికోసం పోరాటం చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ జగన్ మాట్లాడిన తీరు ఇలాగే ఉందని రాజకీయ మేథావులు అంటున్నారు. వారసత్వ పదవి రాలేదు కాబట్టి , సొంత పార్టీ ద్వారనైన.. ముఖ్యమంత్రి పదవి దక్కుతుందో లేదో అనే అనుమానంతో జగన్ ముందుకు పోతున్నారు.
ఇక లోక్ స్తతా:
ప్రజలు కు మేలు చేయ్యాలనే ఉద్దేశం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, లోక్ సత్తా పేరుతో ప్రజల ముందుకు వచ్చారు జయప్రకాశ నారాయణ. సింగిల్ హ్యాండ్ గణేష్ మాత్రం .. అసెంబ్లీలో .. గోల చేసిన ప్రతి సారీ.. తోటి ఎమ్మెల్యే చేతి దెబ్బలకు గురైన నేతగా.. రాష్ట్రంలో గుర్తించపడ్డారు. రాష్ట్ర విభజనకు మా పార్టీ అనుకూలమే అంటూ... ఢిల్లీలో గెలిచిన చీపుకట్టను చూసి.. అనుమానంగా ప్లేట్ ఫిరాయించాడు.
రాష్ట్ర విభజనలో అందరికి సమన్యాయం కావాలని జై సమైక్యంద్ర అనటంతో.. తెలంగాణ విద్యార్థులు.. జేసి చొక్కపట్టుకున్నారు. ఇప్పుడు జేసి పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఎవరితో పొత్తుపెట్టుకుంటే.. తనకు తోడుగా .. కొంతమంది సొంత ఎమ్మెల్యేలను తెచ్చుకోవటానికి .. పార్టీల పై అనుమానంగా చూస్తున్నారు.
ఇక ఎంఐఎం పార్టీ
ఇక ఈ పార్టీ నాయకులు మాత్రం .. మొదటి నుంచి ఒకటే బాట, ఒకటే బాణం. ఇస్తే రాయల తెలంగాణ ఇవ్వండి. లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండని చెప్పటం జరిగింది. కానీ రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ తో పెట్టుకుంటే.. పార్టీకి, ముస్లీంలకు మంచి జరిగింది అనే దానిపై.. ప్రధాన పార్టీల వైపు అనుమానం గా చూస్తున్నారు.
ఇక మిగిలింది.. రాష్ట్ర ముఖ్యమంత్రి.
కేంద్రం పై సమైక్య యుద్దం చేస్తున్న వీరుడుగా, తెలంగాణ ద్రోహిగా పేరు తెచ్చుకున్నాడు. ఒక దెబ్బకు రెండు పిట్టలు మాదిరిగా ..రాస్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. సమైక్య శంఖం వినిపించాడు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ పై సమైక్య యుద్దం అనుమానంతో ప్రకటించాడు. తెలంగాణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందితే నేను రాజీనామా చేస్తానని ..మీడియా మందు అనుమానంతోనే ప్రకటన చేశాడు. రాష్ట్రం సమైక్యం ఉంటుందా లేదా అనే అనుమానంతో నల్లారి కిరణ్ రాజకీయ నడక సాగిస్తున్నాడు.
ఇక రాష్ట్ర ప్రజలు ..
తెలంగాణ వస్తుందో లేదో అనే అనుమానంతో.. తెలంగాణ ప్రజలు, రాష్ట్రం సమైక్యం ఉంటుందో లేదో అనే అనుమానంతో సీమాంద్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇన్నీ అనుమానాల దెబ్బకు . రాష్ట్ర అభివ్రుద్ది పూర్తిగా ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు అభివ్రుద్ది మొదలవుతుందో చూద్దాం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more