YS Jagan Mohan Reddy Controversial Comments On Chandrababu In Vizag Yuvabheri Conference | AP Special Status | AP Govt Jobs

Ys jagan mohan reddy controversial comments chandrababu vizag yuvabheri conference

ys jagan, jagan mohan reddy, jagan speech, jagan yuvabheri conference, vizag yuvabheri conference, ys jagan updates, chandrababu naidu controversies, ap special status, ap govt jobs

YS Jagan Mohan Reddy Controversial Comments Chandrababu Vizag Yuvabheri Conference : YS Jagan Mohan Reddy Controversial Comments On Chandrababu In Vizag Yuvabheri Conference In The Issues Of Special Status And Govt Jobs.

సీఎం అయ్యారు.. వాళ్లని పీకేస్తున్నారు : జగన్

Posted: 09/22/2015 01:07 PM IST
Ys jagan mohan reddy controversial comments chandrababu vizag yuvabheri conference

ఏపీకి ‘ప్రత్యేక హోదా’ కోసం వైకాపాధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్టణంలో ‘యువభేరి’ సమరశంఖం పూరించారు. విశాక కళావాణి పోర్టు స్టేడియంలో జరిగిన ఈ సదస్సులో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు, ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. హోదాపై బాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంత్రుల్లో కొంతమందికి అసలు ‘ప్రత్యేక హోదా’ అంటే ఎంటో కూడా తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పదేళ్లు ‘ప్రత్యేక హోదా’ ఇస్తామని ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చెప్పిందని... కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని పేర్కొన్నారు.

ఇక ఎన్నికల నేపథ్యంలో బాబు చేసిన ‘ఉద్యోగ హామీ’ని గుర్తూ చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు తాను సీఎం అయితే ఉద్యోగం వస్తుందని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని, అలాగే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఆయన సీఎం అయ్యాక ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారుని విమర్శించారు. ఒక్క విశాఖలోనే 5వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోయాయని జగన్ చెప్పారు. అంతేగాక ఇప్పటివరకు ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఇక డీఎస్సీ పరీక్ష రాసిన వారికీ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం కూడా లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి నోటిఫికేషన్ విడుదలచేసి ఖాళీలను భర్తీ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు యూనివర్శిటీల్లో 5వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.

వర్సిటీలు దివాళా తీయాలన్న ఆలోచనలో బాబు ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ప్రైవేటు యూనివర్శిటీలను తీసుకురావాలన్నదే చంద్రబాబు ఆలోచన అని జగన్ చెప్పుకొచ్చారు. దాంతో ఇక విద్యార్థులకు కన్వీనర్ కోటా ఉండదని, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తీసేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే రైతుల రుణమాఫీపై జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు రుణాలు ఏ ఒక్కరికీ మాఫీ కాలేదని, బాబు ఇచ్చిన డబ్బులు వడ్డీలకే సరిపోవడం లేదని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more