వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాకి మైకు దొరికితే చాలు.. అధికార టీడీపీ పార్టీపై ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద విమర్శనాస్త్రాలు సంధిస్తుంటుంది. నిజానికి ఈమె రాజకీయ పాఠాలు నేర్చుకుంది టీడీపీ నుంచే కానీ.. వైసీపీ మంచి హోదా ఇచ్చి అక్కున చేర్చుకోవడంతో ఆ పార్టీపై ఎగిరి గంతులేస్తోంది. ఇప్పుడు తాజాగా మరోసారి ఈమె బాబు మీద విమర్శలు చేసింది.
తమ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరికలతోనే చంద్రబాబులో చలనం కనిపిస్తోందని రోజా పేర్కొంది. నవ్యాంధ్ర రాజధాని భూమి కోసం ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ కు నిరసనగా విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ముందు జగన్ నేటి ఉదయం దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దీక్షలో పాల్గొన్న సందర్భంగా రోజా మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు గుప్పించింది. 14 నెలలుగా తాము చంద్రబాబు లాంటి సీఎం పాలనలో ఉండటం మన దౌర్భాగ్యం అని ప్రజలు బాధపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించింది. ఆర్టీసీ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై స్పందించిన జగన్, సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించిన తర్వాతే చంద్రబాబు ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించిందని ఆమె గుర్తు చేసింది.
ఇక ఈ నేపథ్యంలోనే ఆమె రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనను గుర్తుచేస్తూ.. జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ను నిలదీసింది. భూసేకరణపై అంతెత్తున ఎగిరిపడ్డ పవన్ కల్యాణ్.. నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించింది.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more