ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పవన్ గతకొన్నాళ్ల నుంచి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈమధ్య ఆయన వరుసగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు తమదైన రీతిలో పవన్ పై విమర్శలు కురిపించారు. భూసేకరణ ఎలా చెయ్యాలో నేర్పించాలంటూ కొందరు సీనియర్ నేతలు వ్యంగ్యంగా కోరారు కూడా! అయితే.. చంద్రబాబు వెనకే వుండి పార్టీ నేతలతో పవన్ పై విమర్శలు చేయిస్తున్నారంటూ వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆ వార్తల్ని తిప్పికొడుతూ తాజాగా బాబు స్పందించారు. అలాగే.. తన పార్టీ నేతలకు సైతం పవన్ విషయమై సూచించారు.
భూసేకరణను వ్యతిరేకిస్తున్న పవన్ పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు బాబు ఫుల్ స్టాప్ పెట్టేశారు. పవన్ భూసేకరణపై చేస్తున్న వ్యాఖ్యలపై ప్రతివిమర్శలకు దిగొద్దని ఆయన హితువు పలికారు. కొంతమంది రైతులు పవన్ ను ఆశ్రయించడం వల్లే వారి సంక్షేమం కోసం ఆయన అలా మాట్లాడుతున్నారని, అందులో ఏమాత్రం తప్పు లేదని పేర్కొన్నారు. భూసేకరణపై వాస్తవ పరిస్థితులను పవన్ కు తానే స్వయంగా వివరిస్తానని బాబు చెప్పారు. ఈ విధంగా బాబు చెప్పడంతో టీడీపీ నేతలు పవన్ విషయమై కాస్త వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. అలాగే.. వీరిద్దరి మధ్య చీలికలు వచ్చాయని వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లేనని చెప్పొచ్చు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more